టాలీవుడ్ సినిమా చరిత్రలో కొన్ని డేట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిలో ఏప్రిల్ 28 చాలా స్పెషల్. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అడవిరాముడు రిలీజయ్యింది ఈ రోజే. ఇప్పటికీ దీనికి కురిసిన కనకవర్షం గురించి పెద్దోళ్ళు కథలుగా చెబుతారు. మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన పోకిరి గురించి మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి 2, అలీ లాంటి కమెడియన్ తో యమలీల రూపంలో సిల్వర్ జూబ్లీ కొట్టొచ్చని నిరూపించిన ఎస్వి కృష్ణారెడ్డి సాహసం ఇలా ఎందరో అభిమానులకు ఈ డేట్ తో మంచి సెంటిమెంట్ ఉంది.
ఇప్పుడొచ్చిన ఏజెంట్ తో దానికి చరమ గీతం పడిపోయింది. నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్ల టైంలో దీని గురించే నొక్కి వక్కాణిస్తూ దెబ్బకు అఖిల్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడని తెగ ఊరించారు. కట్ చేస్తే రెండో రోజే నైజామ్ లో దారుణంగా క్రాష్ అయ్యేంత పెద్ద డిజాస్టర్ గా ఏజెంట్ రన్ మరీ దీనంగా ఉంది. దెబ్బకు అఖిల్ సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యాడు. ట్రోలింగ్స్ కి అమల ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. నాగార్జున పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఫస్ట్ షోకి విషెస్ చెప్పక ఎలాంటి సౌండ్ లేదు
రాబోయే రోజుల్లో ఎవరైనా ఏప్రిల్ 28 లక్కీ డేటని ప్రచారం చేసుకుంటే వెంటనే ఏజెంట్ ఉదాహరణను తీసుకొస్తారు సోషల్ మీడియా జనాలు. ఎందుకంటే ఇది ఇప్పట్లో మాసిపోయే గాయం కాదు. కొన్నేళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. గత ఏడాది ఆచార్య, లైగర్ లను మించినవి రావు అనుకుంటే ఈ సంవత్సరం శాకుంతలం, ఏజెంట్ రెండూ వాటిని తలదన్నేలా ఆడుతున్నాయి. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఇలాంటి సెంటిమెంట్లతో పని లేదు కానీ ఎటొచ్చి కథల ఎంపికలో కుర్ర హీరోలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏజెంట్ మరోసారి హెచ్చరికగా నిలిచింది
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…