టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో అక్కినేని వారిది ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ లాగా మాస్ హీరో కాకపోయినా, మాస్ సినిమాలు చేయకపోయినా.. తన శైలి క్లాస్ సినిమాలతోనే భారీ విజయాలు అందుకున్నారు.
దశాబ్దాల పాటు తన ఆధిపత్యాన్ని చాటారు. ఏఎన్నార్ స్థాయిలో హవా సాగించకపోయినా.. ఆయన వారసుడు అక్కినేని నాగార్జున సైతం తన స్థాయిలో ఘనవిజయాలే అందుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగాడు.
మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రయోగాత్మక, సాహసోపేత చిత్రాల్లో నటిస్తూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించాడు నాగ్. కానీ బాధాకార విషయం ఏంటంటే.. కొన్నేళ్లుగా ఆయన బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆయన నట వారసులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు.
2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత నాగార్జునకు నిఖార్సయిన మాస్ హిట్ లేదు. రోజు రోజుకూ ఆయన ఫాలోయింగ్, మార్కెట్ పడిపోతున్నాయి. గత ఏడాది ‘ది ఘోస్ట్’ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు కింగ్. ఇక మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి.. తన శైలిలో ఏదో లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు చేసి అడపాదడపా విజయాలు అందుకుంటున్న నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్యకు గత ఏడాది ‘థాంక్యూ’ దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది.
ఇది చైతూకు నప్పే సినిమానే అయినా.. అది కూడా ఆడలేదు. ఎంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా సరే.. మరీ ఐదు కోట్ల షేర్ కూడా రాబట్టలేదంటే చైతూ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఓ మోస్తరు సక్సెస్ అందుకుని.. ఈసారి పెద్ద మాస్ హీరో అయిపోదామని నాగ్ చిన్న కొడుకు అఖిల్ చేసిన ‘ఏజెంట్’ పరిస్థితి ఇప్పుడు ఏమైందో తెలిసిందే. మార్నింగ్ షోలతోనే దీని తలరాత ఏంటో తేలిపోయింది. అక్కినేని వారి ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. కేవలం 9 నెలలో వ్యవధిలో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మూడు పెద్ద డిజాస్టర్లు ఇవ్వడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఈ ముగ్గురూ బలంగా కమ్ బ్యాక్ ఇవ్వకపోతే అక్కినేని బ్రాండు మరింత బీటలు వారడం ఖాయం.
This post was last modified on April 29, 2023 5:58 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…