కొన్ని సినిమాలు ఓ దర్శకుడి చేతికి వెళ్ళి మళ్ళీ మరో దర్శకుడి దగ్గరికి వెళ్ళడం చాలా సందర్భాలలో జరిగినవే. అయితే పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ సినిమాను ముందుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు దిల్ రాజు. వేణు శ్రీరామ్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టక ముందే కొందరు దర్శకులను అనుకున్నారు. అందులో ప్రధముడు హరీష్. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకున్నాడు.
నీరు కొండ పార్వై సినిమా ట్రైలర్ హరీష్ శంకర్ నాకు పంపించి ఒకసారి చూడండి పవన్ గారికి ఈ సినిమా తెలుగులో బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత నేను ఆ సినిమా చూడటం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ మరో సినిమాతో బిజీ గా ఉండటం వల్ల ఐకాన్ ఆలస్యం అవుతుండటంతో వేణు శ్రీరామ్ చేతిలో పెట్టమని తెలిపాడు. ఇక పవన్ తో సినిమా చేస్తావా ? అని ఆడగగానే వేణు శ్రీరామ్ చేసిన వర్క్ నచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లానని దిల్ రాజు తెలిపారు.
ఇక ఒక టైమ్ లో పవన్ గారిని కలిసేందుకు వీలు అవ్వకపోవడంతో త్రివిక్రమ్ గారి ద్వారా అప్రోచ్ అయ్యమని రాజు అన్నారు. అజిత్ గారి సినిమాను పవన్ గారితో చేయాలని అనుకుంటున్నాం అనగానే త్రివిక్రమ్ మీరు కాన్ఫిడెంట్ ఆ ? అని అడిగి వెంటనే పవన్ గారికి సినిమా చూపించే ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా చేశారని అన్నారు. సో అలా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఫైనల్ గా హరీష్ దగ్గర నుండి వేణు శ్రీరామ్ చేతిలో పడింది.
This post was last modified on April 29, 2023 9:11 pm
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…