కొన్ని సినిమాలు ఓ దర్శకుడి చేతికి వెళ్ళి మళ్ళీ మరో దర్శకుడి దగ్గరికి వెళ్ళడం చాలా సందర్భాలలో జరిగినవే. అయితే పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ సినిమాను ముందుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు దిల్ రాజు. వేణు శ్రీరామ్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టక ముందే కొందరు దర్శకులను అనుకున్నారు. అందులో ప్రధముడు హరీష్. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకున్నాడు.
నీరు కొండ పార్వై సినిమా ట్రైలర్ హరీష్ శంకర్ నాకు పంపించి ఒకసారి చూడండి పవన్ గారికి ఈ సినిమా తెలుగులో బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత నేను ఆ సినిమా చూడటం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ మరో సినిమాతో బిజీ గా ఉండటం వల్ల ఐకాన్ ఆలస్యం అవుతుండటంతో వేణు శ్రీరామ్ చేతిలో పెట్టమని తెలిపాడు. ఇక పవన్ తో సినిమా చేస్తావా ? అని ఆడగగానే వేణు శ్రీరామ్ చేసిన వర్క్ నచ్చి వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లానని దిల్ రాజు తెలిపారు.
ఇక ఒక టైమ్ లో పవన్ గారిని కలిసేందుకు వీలు అవ్వకపోవడంతో త్రివిక్రమ్ గారి ద్వారా అప్రోచ్ అయ్యమని రాజు అన్నారు. అజిత్ గారి సినిమాను పవన్ గారితో చేయాలని అనుకుంటున్నాం అనగానే త్రివిక్రమ్ మీరు కాన్ఫిడెంట్ ఆ ? అని అడిగి వెంటనే పవన్ గారికి సినిమా చూపించే ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా చేశారని అన్నారు. సో అలా పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఫైనల్ గా హరీష్ దగ్గర నుండి వేణు శ్రీరామ్ చేతిలో పడింది.
This post was last modified on April 29, 2023 9:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…