Movie News

ప్రభాస్ కి కథ చెప్పి అఖిల్ తో ?

ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమాతో థియేటర్స్ లో ఉన్న అఖిల్ నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో అనీల్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్న అనీల్ గతంలో ప్రభాస్ కి ఓ కథ చెప్పాడని టాక్ ఉంది. సాహో , రాదేశ్యామ్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు అనీల్. సాహో టైమ్ లోనే యూవీ నిర్మాతలకు ఓ ఐడియా చెప్పి వాళ్ళ మెప్పు పొందాడు. ఆ కథను ప్రభాస్ తో చేయించాలని భావించారట నిర్మాతలు. కానీ సాహో , రాధే శ్యామ్ ఎఫెక్ట్ తో అనీల్ ను ప్రభాస్ కి జత చేయడం కరెక్ట్ కాదని భావించి అతనికి ఇప్పుడు అఖిల్ సినిమా అప్పగించారని ఇన్ సైడ్ టాక్.

ప్రభాస్ కోసం రెడీ చేసిన ఆ కథతోనే అనీల్ ఇప్పుడు అఖిల్ సినిమా చేస్తున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్ సరైన హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో నెక్స్ట్ సినిమాపై అఖిల్ చాలా కేర్ తీసుకొనున్నాడు. ఈ సినిమాతో అక్కినేని హీరో కోరుకున్న సాలిడ్ హిట్ పడుతుందని యూవీ నిర్మాతలు అనీల్ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారట.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago