స్పై జానర్ సినిమా అంటే స్క్రిప్టింగ్ లోనే ఎంతో కసరత్తు చేసుకోవాలి. హీరో డేట్స్ ఉన్నాయి కదా అని , నిర్మాత దొరికాడు కదా అని సాదా సీదా కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు తిప్పి కొట్టడం ఖాయం. తాజాగా అఖిల్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ఏజెంట్’ ఇందుకు పెద్ద ఉదాహరణ. నిజానికి ఏజెంట్ విషయంలో అఖిల్ ని తప్పు పట్టడానికి ఏమిలేదు. కావల్సినంత కష్టపడ్డాడు. నటన పరంగా కూడా పాత్రకు తగ్గట్టే చేశాడు. లోపమంతా కథ , కథనం, డైరెక్షన్ లో ఉంది.
అసలు వక్కంతం ఇచ్చిన ఈ కథను తీసుకోవడమే సురేందర్ రెడ్డి చేసిన మొదటి తప్పు. దాన్ని ఎలాంటి కిక్ ఇవ్వని ప్లాట్ స్క్రీన్ ప్లే తో తీయడం మరో తప్పు. లాజికులు పక్కన పెట్టేసి స్పై మూవీను ఏదో కమర్షియల్ యాక్షన్ సినిమాలా తీస్తే ఎలా ? హెలీ కాప్టర్స్, ఖరీదైన కారులు, విదేశాల్లో షూటింగ్ చేస్తే సరిపోతుందా ? అసలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉండన్నక్కర్లేదా ?
ఈ జానర్ లో సినిమాలు చేసిన హీరోలు చాలా అరుదు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు శేష్ లాంటివాళ్లు మాత్రమే స్పై మూవీస్ చేశారు. గూడచారితో అడివి శేష్ హాలీవుడ్ స్టైల్ స్పై థ్రిల్లర్ చూపించి శెభాష్ అనిపించుకున్నాడు. కనీసం ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు అడివి శేష్ ఏం చేశాడు ? ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ? అని తెలుసుకోవాలి కదా. ఎక్కడో అమెరికాలో కాదు ఇక్కడే మన తెలుగు హీరో ఉండనే ఉన్నాడు. ఈ జోనర్ లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసి దానికి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేసుకుంటూ స్క్రిప్ట్ మీదే కొన్ని నెలలు వర్క్ చేస్తున్న శేష్ నుండి ఎవరైనా నేర్చుకోవాల్సిందే మరి.
This post was last modified on April 29, 2023 8:54 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…