బ‌ద్రి కోసం నందా మళ్లీ వచ్చాడు

వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌ల‌ది ఎవ‌ర్ గ్రీన్ కాంబినేష‌న్. బ‌ద్రి సినిమాలో వాళ్లిద్ద‌రూ నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ ప‌డి ఇచ్చిన పెర్ఫామెన్స్.. ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు అంత సులువుగా మ‌రిచిపోలేరు. ఆ త‌ర్వాత కెమెరామ‌న్ గంగ‌తో రాంబాబు, వ‌కీల్ సాబ్ చిత్రాల్లోనూ వీరి కాంబినేష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌రోసారి ఈ జోడీని తెర‌పై చూడ‌బోతున్నాం. ప‌వ‌న్ కొత్త సినిమా ఓజీలో ప్ర‌కాష్ రాజ్‌కు కీల‌క పాత్ర ద‌క్క‌డం విశేషం. ఆల్రెడీ ఈ విల‌క్ష‌ణ న‌టుడు ఆ సినిమా షూటింగ్‌కు కూడా హాజ‌ర‌వుతున్నాడ‌ట‌.

ముంబ‌యిలో ఇటీవ‌లే ఓజీ తొలి షెడ్యూల్ మొద‌లైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ముంబ‌యిలోనే ఉంటూ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. తాజాగా ప్ర‌కాష్ రాజ్ సెట్లో అడుగు పెట్టిన‌ట్లు తెలిసింది. మ‌రి సుజీత్ లాంటి ట్రెండీ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ రాజ్ కోసం ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడు.. ప‌వ‌న్‌, ప్ర‌కాష్ రాజ్ కాంబోలో వ‌చ్చే సీన్లు ఎలా ఉంటాయి అన్న‌ది ఆస‌క్తిక‌రం. తొలి ద‌శ‌లో ప‌వ‌న్ ఈ సినిమా కోసం కేటాయించిన డేట్ల‌లో వీలైన‌న్ని ఎక్కువ స‌న్నివేశాలు తీయ‌డానికి చిత్ర బృందం ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్యాంగ్ లీడ‌ర్ భామ ప్రియాంక మోహ‌న్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌కాష్‌రాజ్‌ది బ‌హుశా విలన్ పాత్రే అయ్యుంటుంద‌ని భావిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యాక ప‌వ‌న్ మ‌ళ్లీ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా కోసం కొన్ని రోజులు ప‌ని చేస్తాడు. ఆ త‌ర్వాత ఓజీ కోసం తిరిగొస్తాడు.