తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన అన్నగారు ఎన్టీఆర్ శత జయంతిని గత ఏడాది మే 28 నుంచి రాష్ట్రం, దేశ విదేశాల్లోనూ నిర్వహిస్తున్నారు.అయితే.. ఇప్పుడు నేటి నుంచి(ఏప్రిల్ 28) వచ్చే నెల అన్నగారి 100వ జయంతి(మే 28) వరకు ఊరూవాడా ఘనంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా విజయవాడ శివారులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
అయితే.. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిజానికి ఎంతో మంది ఎన్టీఆర్తో కలిసి నటించిన వారు ఉన్నా.. రజనీని పిలవడానికి ప్రత్యేక కారణం.. ఉంది. రజనీ ఇంట్లో నిలువెత్తు ఎన్టీఆర్ చిత్రపటం ఉండడమే కాకుండా.. సినీరంగంలో ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన దారుల్లోనే రజనీ నడుస్తున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
దీంతో టీడీపీ నుంచి ఆహ్వానం అందగానే.. రజనీ కాంత్ విజయవాడలో వాలిపోయారు. ఇక, ఎన్టీఆర్తో రజనీ కలిసి నటించిన సినిమాలు రెండే రెండు. ఒకటి టైగర్. ఇది పూర్తిగా తెలుగు సినిమా అయితే.. రెండో మణ్ణన్ వాణి(నిండు మనిషి) అనే తమిళ సినిమా. ఈ రెండు సినిమాలతోనే ఇద్దరి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. నిర్మాతకు విలువ ఇవ్వడం.. గౌరవం ఇవ్వడం.. నిర్మాతలను వేధించకుండా.. ఉండడం వంటివి అన్నగారి నుంచి తాను నేర్చుకున్నానని.. అనేక సందర్భాల్లో రజనీ చెప్పారు. వాటినే ఇప్పటికీ ఆయన పాటిస్తున్నారు.
ఇక, విజయవాడ చేరుకున్న రజనీకాంత్కు.. నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. వెంటనే ఆయన విజయవాడలోని ఓ హోటల్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలయ్యతో కలిసి.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. అక్కడ తేనీటి విందు తీసుకున్నాక.. సాయంత్రం 6 గంటలకు అందరూ కలిసి.. విజయవాడ లో నిర్వహించే అన్నగారి శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
This post was last modified on April 28, 2023 2:02 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…