తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన అన్నగారు ఎన్టీఆర్ శత జయంతిని గత ఏడాది మే 28 నుంచి రాష్ట్రం, దేశ విదేశాల్లోనూ నిర్వహిస్తున్నారు.అయితే.. ఇప్పుడు నేటి నుంచి(ఏప్రిల్ 28) వచ్చే నెల అన్నగారి 100వ జయంతి(మే 28) వరకు ఊరూవాడా ఘనంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా విజయవాడ శివారులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
అయితే.. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిజానికి ఎంతో మంది ఎన్టీఆర్తో కలిసి నటించిన వారు ఉన్నా.. రజనీని పిలవడానికి ప్రత్యేక కారణం.. ఉంది. రజనీ ఇంట్లో నిలువెత్తు ఎన్టీఆర్ చిత్రపటం ఉండడమే కాకుండా.. సినీరంగంలో ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన దారుల్లోనే రజనీ నడుస్తున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
దీంతో టీడీపీ నుంచి ఆహ్వానం అందగానే.. రజనీ కాంత్ విజయవాడలో వాలిపోయారు. ఇక, ఎన్టీఆర్తో రజనీ కలిసి నటించిన సినిమాలు రెండే రెండు. ఒకటి టైగర్. ఇది పూర్తిగా తెలుగు సినిమా అయితే.. రెండో మణ్ణన్ వాణి(నిండు మనిషి) అనే తమిళ సినిమా. ఈ రెండు సినిమాలతోనే ఇద్దరి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. నిర్మాతకు విలువ ఇవ్వడం.. గౌరవం ఇవ్వడం.. నిర్మాతలను వేధించకుండా.. ఉండడం వంటివి అన్నగారి నుంచి తాను నేర్చుకున్నానని.. అనేక సందర్భాల్లో రజనీ చెప్పారు. వాటినే ఇప్పటికీ ఆయన పాటిస్తున్నారు.
ఇక, విజయవాడ చేరుకున్న రజనీకాంత్కు.. నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. వెంటనే ఆయన విజయవాడలోని ఓ హోటల్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలయ్యతో కలిసి.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. అక్కడ తేనీటి విందు తీసుకున్నాక.. సాయంత్రం 6 గంటలకు అందరూ కలిసి.. విజయవాడ లో నిర్వహించే అన్నగారి శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…