సమంతను శకుంతలగా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన మైథాలాజికల్ పీరియాడిక్ డ్రామా ‘శాకుంతలం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గుణ శేఖర్ తో కలిసి దిల్ రాజు నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైమ్ లో 3d కి కన్వర్ట్ చేసి స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద గుణ శేఖర్ తో పాటు దిల్ రాజు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. సమ్మర్ లో పిల్లలతో కుటుంబాలు ఈ సినిమాకి వచ్చి కలెక్షన్స్ ఇస్తారని ఆశించారు.
కట్ చేస్తే సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో దిల్ రాజు కి ఈ సినిమా భరే నష్టాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సినిమా రిజల్ట్ పై రియాక్ట్ అయ్యాడు దిల్ రాజు. తన పాతికేళ్ళ కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా దిల్ రాజు ఎన్నో నష్టాలు చూశారు. కానీ శాకుంతలం పెద్ద ఎఫెక్ట్ అని చెప్పడంతో ఈ సినిమా ఆయనకి నిర్మాతగా భారీ లాస్ తెచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
అనుష్క తో ‘రుద్రమదేవి’ తీసి నిర్మాతగా ఇబ్బందులు పడ్డ గుణశేఖర్ కి శాకుంతలం తో దిల్ రాజు భాగస్వామ్యం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఫైనాన్షియల్ గా అన్నీ దిల్ రాజు నే చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో దిల్ రాజు మంచి బడ్జెట్ నే పెట్టారు కూడా. ముఖ్యంగా 3d కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక శకుంతల దుష్యంత్ ల ప్రేమ కథతో తీసిన ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మినిమం ఆసక్తి చూపలేదు. పైగా మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ తో సమంత క్రేజ్ కూడా ఓపెనింగ్స్ తేలికపోయింది. ఏదేమైనా దిల్ రాజు కి గుణ శేఖర్ శాకుంతలం రూపంలో పెద్ద జలక్ తగిలింది.
This post was last modified on April 27, 2023 7:09 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…