Movie News

పాతికేళ్ల జర్నీలో పెద్ద జలక్

సమంతను శకుంతలగా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన మైథాలాజికల్ పీరియాడిక్ డ్రామా ‘శాకుంతలం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గుణ శేఖర్ తో కలిసి దిల్ రాజు నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైమ్ లో 3d కి కన్వర్ట్ చేసి స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద గుణ శేఖర్ తో పాటు దిల్ రాజు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. సమ్మర్ లో పిల్లలతో కుటుంబాలు ఈ సినిమాకి వచ్చి కలెక్షన్స్ ఇస్తారని ఆశించారు.

కట్ చేస్తే సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో దిల్ రాజు కి ఈ సినిమా భరే నష్టాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సినిమా రిజల్ట్ పై రియాక్ట్ అయ్యాడు దిల్ రాజు. తన పాతికేళ్ళ కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా దిల్ రాజు ఎన్నో నష్టాలు చూశారు. కానీ శాకుంతలం పెద్ద ఎఫెక్ట్ అని చెప్పడంతో ఈ సినిమా ఆయనకి నిర్మాతగా భారీ లాస్ తెచ్చిందని అర్థం చేసుకోవచ్చు.

అనుష్క తో ‘రుద్రమదేవి’ తీసి నిర్మాతగా ఇబ్బందులు పడ్డ గుణశేఖర్ కి శాకుంతలం తో దిల్ రాజు భాగస్వామ్యం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఫైనాన్షియల్ గా అన్నీ దిల్ రాజు నే చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో దిల్ రాజు మంచి బడ్జెట్ నే పెట్టారు కూడా. ముఖ్యంగా 3d కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక శకుంతల దుష్యంత్ ల ప్రేమ కథతో తీసిన ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మినిమం ఆసక్తి చూపలేదు. పైగా మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ తో సమంత క్రేజ్ కూడా ఓపెనింగ్స్ తేలికపోయింది. ఏదేమైనా దిల్ రాజు కి గుణ శేఖర్ శాకుంతలం రూపంలో పెద్ద జలక్ తగిలింది.

This post was last modified on April 27, 2023 7:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

27 minutes ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

1 hour ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

8 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

10 hours ago

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…

13 hours ago

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై…

13 hours ago