సమంతను శకుంతలగా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన మైథాలాజికల్ పీరియాడిక్ డ్రామా ‘శాకుంతలం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గుణ శేఖర్ తో కలిసి దిల్ రాజు నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న టైమ్ లో 3d కి కన్వర్ట్ చేసి స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీద గుణ శేఖర్ తో పాటు దిల్ రాజు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. సమ్మర్ లో పిల్లలతో కుటుంబాలు ఈ సినిమాకి వచ్చి కలెక్షన్స్ ఇస్తారని ఆశించారు.
కట్ చేస్తే సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో దిల్ రాజు కి ఈ సినిమా భరే నష్టాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సినిమా రిజల్ట్ పై రియాక్ట్ అయ్యాడు దిల్ రాజు. తన పాతికేళ్ళ కెరీర్ లో శాకుంతలం సినిమా పెద్ద జర్క్ ఇచ్చిందని చెప్పుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా దిల్ రాజు ఎన్నో నష్టాలు చూశారు. కానీ శాకుంతలం పెద్ద ఎఫెక్ట్ అని చెప్పడంతో ఈ సినిమా ఆయనకి నిర్మాతగా భారీ లాస్ తెచ్చిందని అర్థం చేసుకోవచ్చు.
అనుష్క తో ‘రుద్రమదేవి’ తీసి నిర్మాతగా ఇబ్బందులు పడ్డ గుణశేఖర్ కి శాకుంతలం తో దిల్ రాజు భాగస్వామ్యం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఫైనాన్షియల్ గా అన్నీ దిల్ రాజు నే చూసుకున్నారు. ఇక ఈ సినిమాలో దిల్ రాజు మంచి బడ్జెట్ నే పెట్టారు కూడా. ముఖ్యంగా 3d కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక శకుంతల దుష్యంత్ ల ప్రేమ కథతో తీసిన ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మినిమం ఆసక్తి చూపలేదు. పైగా మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ తో సమంత క్రేజ్ కూడా ఓపెనింగ్స్ తేలికపోయింది. ఏదేమైనా దిల్ రాజు కి గుణ శేఖర్ శాకుంతలం రూపంలో పెద్ద జలక్ తగిలింది.
This post was last modified on April 27, 2023 7:09 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…