మత సంబంధిత వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసినపుడు సెన్సార్ వాళ్లను ఒప్పించి సినిమాను బయటికి తీసుకురావడం అంత తేలిక కాదు. కొన్నిసార్లు సెన్సార్ వాళ్లు బాగా కోతలు వేస్తారు. కొన్నిసార్లు సెన్సార్ సమస్యల వల్ల అసలు సినిమాలు బయటికే రాని పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వివాదాస్పద సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆ చిత్రమే.. ది కేరళ స్టోరీ.
హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి, వాళ్లను వ్యూహాత్మకంగా ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రవాదులుగా మార్చి దేశానికి వ్యతిరేకంగా పని చేసేలా చేసే నేపథ్యంలో ఈ సినిమా నడవడం గమనార్హం. కేరళలో ఇలాంటి ఉదంతాలు చాలానే జరిగాయి గతంలో. కానీ ఇలాంటి సున్నితమైన విషయాలపై సినిమాలు తీయడం సాహసమే. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్ పాల్ సింగ్ ఈ సినిమాను నిర్మించాడు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆదా శర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. కేరళలో సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పాత్రలో ఆమె నటించింది. ఆమెతో పాటు మరికొందరు హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు ఒక కాలేజీలో చేరతారు. అక్కడ హాస్టల్లో వారితో పాటు ఒక ముస్లిం అమ్మాయి ఉంటుంది. ఆమె ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఆమె.. వీరిని ఒక వ్యూహం ప్రకారం వాళ్ల మతాల మీద ద్వేషం పుట్టి, ఇస్లాం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది. ఇస్లాం స్వీకరించాక వీరు ఉగ్రవాదులుగా మారతారు. తాము ఎంత తప్పు చేస్తున్నామో ఊహించేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. దేశానికి వ్యతిరేకంగా పని చేసి, ఆ తర్వాత ఉగ్రవాదుల దారుణాలకు బలయ్యే పరిస్థితి వస్తుంది. ఈ క్రమాన్ని చాలా బోల్డ్గా తీసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమా మీద ముస్లిం సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం ఖాయం. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగొచ్చు. థియేటర్ల మీద దాడులు జరిగే అవకాశాలూ లేకపోలేదు. ఐతే మోడీ సర్కారు హయాంలో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి వివాదాస్పద చిత్రాన్ని క్లియర్ చేసిన సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కూడా ఎలాగోలా క్లియరెన్స్ ఇస్తుందనే భావిస్తున్నారు.
This post was last modified on April 27, 2023 6:55 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…