ఎంత రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు అయినా సరే పంపకాల విషయంలో కొట్టుకోవడాలు హత్యలు చేసుకోవడాలు దాకా వెళ్లే సమాజంలో ఉన్నాం మనం. ఇలాంటివి కేవలం మధ్య తరగతి జనాల్లోనే ఉంటాయనుకుంటే తప్పు. అన్ని కుటుంబాల్లోనూ చూడొచ్చు. అలాంటిది అక్కకి తన ప్రేమ చూపించుకోవడం కోసం చెల్లి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని కానుకగా ఇవ్వడం మాత్రం చాలా అరుదు. అది కూడా పుట్టినరోజు సందర్భంగా కావడం మరో విశేషం. బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ కథానాయకి అలియా భట్ ఈ వార్త మీదే హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే అలియా ముంబైలో 38 కోట్ల విలువైన ఫ్లాట్లు కొనుక్కుంది. ముంబై బాంద్రా వెస్ట్ లోని ఖరీదైన ప్రాంతం పాలీ హిల్స్ లో వీటిని సొంతం చేసుకుంది. 2497 చదరపు అడుగుల్లో ఉన్న ఈ ఆస్తికి అక్కడి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. వాటికైన స్టాంప్ డ్యూటీనే 2 కోట్ల 26 లక్షలంటేనే ఏ రేంజ్ ప్రాపర్టీనో అర్థం చేసుకోవచ్చు. వీటిని కొనుక్కున్న రోజే అక్కకి బర్త్ డే గిఫ్ట్ గా రెండు ఫ్లాట్లు ఇచ్చేసింది. వాటి విలువ అక్షరాలా 8 కోట్లు. షహీమ్ భట్ కి ఇచ్చిన ఫ్లాట్లు జుహూ ఏరియాలోని సెలబ్రిటీలు ఉండే ఏబి నాయర్ రోడ్ లో ఉన్న ప్రీమియం అపార్ట్ మెంట్స్ లో ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో అలియా బిజినెస్ లో పెట్టుబడుల కన్నా ఇలా ఫ్లాట్లు కొనుగోలు చేయడం మీద ఆసక్తి చూపిస్తోంది. కాజోల్, అనుష్క శర్మ, అజయ్ దేవగన్, తమన్నా తదితరులు కూడా ఇదే రూటు పట్టారు. ఆ మధ్య రణ్వీర్ సింగ్ దీపికా పదుకునేలు 119 కోట్ల ఖరీదు చేసే క్వాడ్రాప్లెక్స్ ప్లాట్ లను కొనడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాణ సంస్థలు ఇబ్బడిముబ్బడి రెమ్యునరేషన్లు పెంచేయడంతో హిందీ స్టార్ల పంట పండుతోంది. ఒక సినిమా సైన్ చేస్తే చాలు పదిహేను నుంచి వంద కోట్ల దాకా పారితోషికాలు ఇస్తుండటంతో ఇలా కొనడంలో ఆశ్చర్యమేముంది.
This post was last modified on April 26, 2023 4:06 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…