లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్, రిలీజ్లు ఆగిపోయాయి కానీ.. కొత్త కొత్త కాంబినేషన్లు మాత్రం భలే కుదురుతున్నాయి. తరచుగా ఆసక్తికర ప్రాజెక్టులు అనౌన్స్ అవుతున్నాయి. ఇటీవలే కొరటాల శివ-అల్లు అర్జున్ కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీని కంటే ముందు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కంటే ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ఈ సంస్థ అనౌన్స్ చేసింది.
కాగా తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నగరం, ఖైధి లాంటి సినిమాలతో సత్తా చాటుకుని.. ప్రస్తుతం అగ్ర కథానాయకుడు విజయ్తో ‘మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్ను మైత్రీ సంస్థ లాక్ చేసినట్లు సమాచారం.
మైత్రీ సంస్థ ముందు నుంచి నటీనటులు, టెక్నీషియన్ల విషయంలో టాలీవుడ్కు పరిమితం కావడం లేదు. ప్రశాంత్ నీల్తో కమిట్మెంట్ తీసుకోవడం కూడా ఇందులో భాగమే. తమిళ దర్శకుడు అట్లీని కూడా ప్రయత్నించారు కానీ కుదర్లేదు. ఈలోపు లోకేష్ ఈ సంస్థకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి హీరో ఖరారవ్వలేదు. ఓ అగ్ర కథానాయకుడితో మల్టీ లాంగ్వేజ్ సినిమా కోసం లోకేష్కు మంచి ఆఫర్ ఇచ్చారట మైత్రీ అధినేతలు.
అవకాశాన్ని బట్టి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. ఈ ముగ్గురిలో ఒకరితో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. రెండు సినిమాలకే విజయ్ లాంటి అగ్ర కథానాయకుడితో సినిమా చేసే అవకాశం దక్కించుకుున్న లోకేష్.. ‘మాస్టర్’తో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. అతడికి సొంత భాషలో మంచి డిమాండ్ ఉండగా.. మైత్రీ అతణ్ని లాక్ చేయడం విశేషమే.
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…