సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి.. కోట్లాది మంది గుండెల్లో కొలువైపోయిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఏడాది నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోటా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ తమ వంతుగా భారీ ఎత్తునే కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందులో భాగంగా 28న విజయవాడలో ఒక విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు.
తెలుగులో ప్రధానమైన సినిమా వేడుకలన్నింటికీ వ్యాఖ్యాతగా వ్యవహరించే సుమ ఈ కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేయబోతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారకే. అతడి పాపులారిటీ, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాత మీద జూనియర్కు ఉన్న అభిమానం కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి వేడుకలో తారక్ కూడా ఉండాలని నందమూరి అభిమానుల్లో మెజారిటీ కోరుకుంటారు. కానీ అతడికి ఈ వేడుకకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.
తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సైతం ఆహ్వానం అందుకోలేదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ను పిలిస్తే తారక్ను పిలవలేదనే మాట వస్తుందని ఇద్దరినీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరి మిగతా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ వేడుకలో ఎంతమంది పాల్గొంటారో చూడాలి. దాన్ని బట్టి తారక్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా లేదా అనే విషయం తేలిపోతుంది.
This post was last modified on April 26, 2023 3:49 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…