Movie News

‘ఎన్టీఆర్ 100’ సంబరాల్లో ఎన్టీఆర్ ఎక్కడ?


సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి.. కోట్లాది మంది గుండెల్లో కొలువైపోయిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఏడాది నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోటా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ తమ వంతుగా భారీ ఎత్తునే కార్యక్రమాలు చేపడుతోంది.

ఇందులో భాగంగా 28న విజయవాడలో ఒక విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరు కాబోతున్నారు.

తెలుగులో ప్రధానమైన సినిమా వేడుకలన్నింటికీ వ్యాఖ్యాతగా వ్యవహరించే సుమ ఈ కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేయబోతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారకే. అతడి పాపులారిటీ, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాత మీద జూనియర్‌కు ఉన్న అభిమానం కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి వేడుకలో తారక్ కూడా ఉండాలని నందమూరి అభిమానుల్లో మెజారిటీ కోరుకుంటారు. కానీ అతడికి ఈ వేడుకకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సైతం ఆహ్వానం అందుకోలేదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ను పిలిస్తే తారక్‌ను పిలవలేదనే మాట వస్తుందని ఇద్దరినీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. మరి మిగతా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఈ వేడుకలో ఎంతమంది పాల్గొంటారో చూడాలి. దాన్ని బట్టి తారక్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా లేదా అనే విషయం తేలిపోతుంది.

This post was last modified on April 26, 2023 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

5 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

1 hour ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

4 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

5 hours ago