స్టార్ హీరోలు సినిమాల ఎంపికలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాటి తాలూకు ప్రభావాలు అభిమానుల మీద పడతాయి. అది ఫుల్ లెన్త్ అయినా క్యామియో అయినా సరే ఉపయోగపడే అవకాశం లేనప్పుడు వదిలేసుకోవడమే మంచిది. ఉదాహరణకు హాండ్స్ అప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, కృష్ణార్జునలో నాగార్జున ఇలా వీటి వల్ల ఆయా నిర్మాతలకు బిజినెస్ వల్ల ప్రయోజనం కలిగింది కానీ రిజల్ట్ వల్ల డ్యామేజ్ జరిగింది హీరోలకే. తర్వాత మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చెసే సాహసం చేయలేదు కానీ ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం విక్టరీ వెంకటేష్.
ఇటీవలే రిలీజైన కిసీకా భాయ్ కిసీకా జాన్ లో చేసిన పూజా హెగ్డే అన్నయ్య పాత్ర ఎలాంటి పేరుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందు రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ఎంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఓరి దేవుడాలో చేసిన చిన్న క్యారెక్టర్ ఆ సినిమా స్కేల్ ని పెంచలేకపోయింది. తక్కువ గ్యాప్ లో మూడూ ఫ్యాన్స్ ని సైతం సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే సైంధవ్ విషయంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి రెగ్యులర్ మాస్ మసాలాలు లేకుండా దర్శకుడు శైలేష్ కొలను దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఫ్యామిలి ఇమేజ్ ఉన్న వెంకటేష్ డెబ్భై అయిదు సినిమాల తర్వాత ప్రయోగాలకు మొగ్గు చూపడం మంచిదే అయినా స్నేహం కోసమో లేక ఇంకో కారణం కోసమో తనకు నప్పని కంటెంట్ లో నటించడం వల్ల నష్టమే ఎక్కువగా జరుగుతోంది. అసలు సల్మాన్ ఖాన్ కే భాయ్ జాన్ వల్ల ప్రయోజనం కలగనప్పుడు వెంకీకి ఒరిగేది ఏముంటుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. రానా నాయుడు 2లో అయినా కాస్త బూతులు బోల్డ్ కంటెంట్ తగ్గిస్తే బాగుంటుంది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. 2024 జనవరిలో స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని టాక్.
This post was last modified on April 26, 2023 2:41 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…