Movie News

నాలుగో పొరపాటు వద్దు వెంకీ

స్టార్ హీరోలు సినిమాల ఎంపికలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాటి తాలూకు ప్రభావాలు అభిమానుల మీద పడతాయి. అది ఫుల్ లెన్త్ అయినా క్యామియో అయినా సరే ఉపయోగపడే అవకాశం లేనప్పుడు వదిలేసుకోవడమే మంచిది. ఉదాహరణకు హాండ్స్ అప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, కృష్ణార్జునలో నాగార్జున ఇలా వీటి వల్ల ఆయా నిర్మాతలకు బిజినెస్ వల్ల ప్రయోజనం కలిగింది కానీ రిజల్ట్ వల్ల డ్యామేజ్ జరిగింది హీరోలకే. తర్వాత మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చెసే సాహసం చేయలేదు కానీ ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం విక్టరీ వెంకటేష్.

ఇటీవలే రిలీజైన కిసీకా భాయ్ కిసీకా జాన్ లో చేసిన పూజా హెగ్డే అన్నయ్య పాత్ర ఎలాంటి పేరుని తీసుకురాలేకపోయింది. అంతకు ముందు రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ఎంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఓరి దేవుడాలో చేసిన చిన్న క్యారెక్టర్ ఆ సినిమా స్కేల్ ని పెంచలేకపోయింది. తక్కువ గ్యాప్ లో మూడూ ఫ్యాన్స్ ని సైతం సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే సైంధవ్ విషయంలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి రెగ్యులర్ మాస్ మసాలాలు లేకుండా దర్శకుడు శైలేష్ కొలను దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఫ్యామిలి ఇమేజ్ ఉన్న వెంకటేష్ డెబ్భై అయిదు సినిమాల తర్వాత ప్రయోగాలకు మొగ్గు చూపడం మంచిదే అయినా స్నేహం కోసమో లేక ఇంకో కారణం కోసమో తనకు నప్పని కంటెంట్ లో నటించడం వల్ల నష్టమే ఎక్కువగా జరుగుతోంది. అసలు సల్మాన్ ఖాన్ కే భాయ్ జాన్ వల్ల ప్రయోజనం కలగనప్పుడు వెంకీకి ఒరిగేది ఏముంటుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. రానా నాయుడు 2లో అయినా కాస్త బూతులు బోల్డ్ కంటెంట్ తగ్గిస్తే బాగుంటుంది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. 2024 జనవరిలో స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని టాక్.

This post was last modified on April 26, 2023 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

45 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago