Movie News

హాలీవుడ్ గ్యాలక్సీలో జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ తాలూకు చర్చలు ప్రభావాలు ఆస్కార్ వచ్చాక పూర్తిగా ఆగిపోయాయని అనుకుంటున్నాం కానీ కథ ఇంకా చాలా బాకీ ఉందని ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు సూచిస్తునే ఉన్నాయి. తాజాగా విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ తనకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఉందని ట్రిపులార్ చూశాక ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు సింహాలు పులులతో కలిసి దిగుతూ బ్రిటిషర్ల మీద దాడి చేసే సన్నివేశానికి ఫిదా అయిపోయాయని ఇటీవలే ఒక అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించడం ట్విట్టర్ లో ఇన్స్ టాలో వైరల్ అయిపోయింది.

ఇంతకీ జేమ్స్ గన్ ఎవరంటే వచ్చే నెల 5న విడుదల కాబోతున్న గార్డియన్స్ అఫ్ గాలక్సీ వాల్యూం 3 దర్శకుడు. దీని ముందు రెండు భాగాలు ఎంత పెద్ద సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే కాదు 2021లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సూసైడ్ స్క్వాడ్ ని తీసింది కూడా ఇతనే. సూపర్ హీరోస్ ని తెరమీద చూపడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించే జేమ్స్ గన్ నెక్స్ట్ చేయబోయే గాలక్సీ యునివర్స్ లో జూనియర్ ని భాగం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇలాంటి ఇంటెర్నేషల్ ఫిలిం మేకర్ నుంచి కాంప్లిమెంట్ దక్కడం కన్నా ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది.

బాలీవుడ్ మల్టీస్టారర్ వార్ 2లో ఎంపిక కావడంతో మొదలు తారక్ తో ఇలాంటి టైఅప్ వార్తలు బలంగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ తప్ప జూనియర్ ఇంక వేటి గురించి ఆలోచించే పని పెట్టుకోలేదు. ఒకవేళ వార్ 2 కనక త్వరగా మొదలుపెట్టాల్సి వస్తే దానికి అనుగుణంగా డేట్లు అడ్జస్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు తప్పించి అది ఆలస్యమైతే మాత్రం ఎన్టీఆర్ 30 పూర్తయ్యే దాకా తానుగా దేని మీద స్పందించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే నెల మే 20న పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివీల్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

This post was last modified on April 26, 2023 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

16 hours ago