మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. క్లైమాక్స్ భాగాన్ని భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. 1200 ఫైటర్లతో కనివిని ఎరుగని రీతిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట.
మగధీరలో వంద మందిని ఎదురుకుంటేనే ఓ రేంజ్ లో ఊగిపోయిన అభిమానులకు అంతకు పదింతలు అంటే కాళ్ళు ఆగుతాయా. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చే జోరుగా సాగుతోంది. అయితే ఇంత జనం అవసరమైన ఘట్టం వెనుక కథ ఏమై ఉంటుందానే సస్పెన్స్ అందరిలోనూ ఉంది
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఎన్నికల అధికారిగా నటిస్తున్న చరణ్ విలన్ ఎస్ జె సూర్య వేసిన స్కెచ్ వల్ల ఒక సమస్యాత్మక నియోజకవర్గం పోలింగ్ ని పర్యవేక్షించేందుకు ప్రత్యక్షంగా అక్కడికి వస్తాడు. వేలాదిగా గుమికూడిన ఓటర్లలో రౌడీ షీటర్లు కలిసిపోయి ఉంటారు.
వాళ్ళను ఢీ కొట్టే సన్నివేశాలతో పాటు ఎవరూ ఊహించని ఒక ప్రీ క్లైమాక్స్ ట్విస్టు వస్తుందట. ఇవన్నీ భాషతో సంబంధం లేకుండా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులందరికీ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుందని వినికిడి. దీని తాలూకు చిన్న లీక్డ్ వీడియోలు బయటికి వస్తే యూనిట్ వాటిని వెంటనే తీయించే పనిలో పడ్డారు.
చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న గేమ్ చేంజర్ విడుదల ఇంకా ఖరారు చేయలేదు. ఇండియన్ 2 అయ్యేదాకా శంకర్ ఏ విషయం చెప్పలేదని నిస్సహాయత వ్యక్తం చేయడంతో నిర్మాత దిల్ రాజు ఏ సందర్భంలో అడిగినా మాట దాటేస్తున్నారు. పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ లో హీరొయిన్ కియారా అద్వానీకి సైతం యాక్షన్ బ్లాక్స్ పెట్టారు. చరణ్ తను కలిసి చేసిన వర్కౌట్ తాలూకు విజువల్స్ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న గేమ్ చేంజర్ 2024 వేసవి విడుదలకు ప్లాన్ చేసినట్టుగా టాక్
This post was last modified on April 26, 2023 3:31 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…