Movie News

రచ్చ దర్శకుడితో విరుపాక్షుడు

చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష రూపంలో బలమైన కంబ్యాక్ అనుకున్న సాయి ధరమ్ తేజ్ ఆనందం మాములుగా లేదు. ఓ మోస్తరు హిట్ అయినా చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ ఫలితం దక్కడం పట్ల యూనిట్ మొత్తం గాల్లో తేలుతోంది. పైగా మే 5న హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను ప్యాన్ ఇండియా లెవెల్ లో చేయాలని డిసైడయ్యారు. శుక్రవారం ఏజెంట్, పీఎస్ 2 వచ్చాక వాటి రిపోర్టులను బట్టి ప్లానింగ్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇదిలా ఉండగా తేజు నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే ఉంది.

సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ ప్రాజెక్టు లాకయ్యే దిశగా వెళ్తోంది. నిన్న అభిమానులతో ట్విట్టర్ వేదికగా జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు. దానికి తేజు సమాధానమిస్తూ ఏంటి సంపత్ నంది సిద్ధమేనా అంటూ ట్యాగ్ చేయడం అతనూ వెంటనే లైన్ లోకి వచ్చి ఔనన్నట్టు సంకేతం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అఫీషియల్ గా ఇంకా ప్రకటించనప్పటికీ మొత్తానికి ఇద్దరూ ఓకే అనుకున్న మాట వాస్తవమేనని అర్థమవుతోంది. విరూపాక్ష 2 ఉంటుందని ఇటీవలే హింట్ ఇచ్చిన తేజు ముందు ఏది చేస్తాడో చూడాలి

అయితే సంపత్ నంది చాలా ఏళ్లుగా ఫామ్ లో లేడు. రచ్చ సక్సెస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం చూడలేదు. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సీటిమార్ ఏవీ యునానిమస్ గా హిట్ అనిపించుకోలేదు. మధ్యలో కథకుడిగా నిర్మాతగా పలు సినిమాలు చేశాడు కానీ డైరెక్టర్ గా మాత్రం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. మరి సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి కథ రాసుకున్నాడో చూడాలి. విరూపాక్ష తర్వాత తేజు నుంచి ఆడియన్స్ ఏంతో కొంత ప్రత్యేకంగా ఆశిస్తారు. అలాంటప్పుడు మళ్ళీ రొటీన్ బాట ఎక్కకపోతే చాలు. అప్పట్లో ఇంటెలిజెన్స్ పొరపాటు రిపీట్ అవ్వకపోతే అదే పదివేలు

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

5 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

6 hours ago