నానిని నేచురల్ స్టార్ను చేసిన సినిమా భలే భలే మగాడివోయ్. ఆ సినిమా ముందు వరకు అతడి మార్కెట్ ఐదారు కోట్లలో ఉండేది. కానీ ఆ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. ఈ సినిమాతో దర్శకుడు మారుతి కూడా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. అంతకుముందు అతడి కెరీర్లో హిట్లున్నా బూతు డైరెక్టర్ అన్న ముద్ర ఉండేది. కానీ ఈ చిత్రంతో క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించి అన్ని వర్గాల ప్రజలనూ ఉర్రూతలూగించాడు.
ఈ సినిమా తర్వాత నాని, మారుతిల కెరీర్ మాంచి ఊపులో సాగింది. చివరగా నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పలకరించాడు. వి విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల్ని లైన్లో పెట్టాడు. మారుతి తర్వాతి చిత్రం సంగతి ఇంకా తేలలేదు. ఐతే అతను తర్వాతి ప్రాజెక్టుకు స్క్రిప్టు రెడీ చేసేశాడని.. ఆ కథను నానికి వినిపించాడని.. అతను సుముఖత వ్యక్తం చేశాడని.. వచ్చే ఏడాది వీరి కాంబినేషన్లో కొత్త చిత్రం పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2 బేనర్ మీదే బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన వెలువడే అవకాశముంది. నాని-మారుతి కలయికలో అంటే మరోసారి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనరే ఆశిస్తారు ప్రేక్షకులు. సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉంటాయనడంలో సందేహం లేదు.
This post was last modified on August 4, 2020 1:01 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…