అఖిల్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా ప్రకటించిన డేట్ కి వస్తుందా ? లేదా అనే అనుమానాలు మొన్నటి వరకు ఉన్నాయి. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వడం , సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమా రిలీజ్ మీద ఉన్న అన్నీ సందేహాలకి క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటికే కొంత వర్క్ పెండింగ్ ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా టైమ్ కావాలని కోరినా నిర్మాత అనిల్ సుంకర ఎట్టి పరిస్థితిలో ఇదే డేట్ కి వెళ్లిపోదామని ఒప్పించారు.
బహుశా వదిలితే ఇంకా కొన్ని నెలలు సురేందర్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ చేస్తే, అసలుకే మోసం జరుగుతుందని భావించి నిర్మాత డేట్ లాక్ చేసేసి సూరి అండ్ టీం ను ఉరుకులు పరుగులు పెట్టించారు. ఏజెంట్ ను అన్నీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సమయం లేకపోవడంతో తెలుగు, మలయాళం రెండు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ కొన్ని రోజుల ముందే రంగంలోకి దిగాడు. కానీ టైమ్ సరిపోకపోవడంతో అనుకున్నత ప్రమోషన్స్ చేయలేకపోయారు. ఇక ఏజెంట్ కి లాస్ట్ మూమెంట్ వరకూ సురేందర్ రెడ్డి నిద్రమానుకొని వర్క్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ డబ్బింగ్ కరెక్షన్ చెప్పడంతో అఖిల్ ఉన్నపలంగా ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి డబ్బింగ్ కరెక్షన్ చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా ఏజెంట్ టీం రిలీజ్ డేట్ ను అందుకునేందుకు జెట్ స్పీడులో పనిచేయాల్సి వచ్చింది. మరి తెలుగు ఇండస్ట్రీ హిట్లు ఉన్న ఈ లక్కీ డేట్ అఖిల్ కి ఎలా కలిసొస్తుందో చూడాలి.
ఇంగ్లాండ్ టీ20 టూర్లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…