‘బాహుబలి’ తర్వాత చేసిన రెండు సినిమాలు తేడా కొట్టినా.. ప్రభాస్ జోరేమీ తగ్గలేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే లాంటి భారీ చిత్రాలతో పాటు మారుతి సినిమాను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగతోనూ సినిమా కమిటయ్యాడు. ఇందులో నాలుగు సినిమాలు ఏడాది వ్యవధిలో విడుదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రం గురించి రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో ప్రభాస్ ఓ సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
రాజమౌళి అయితే సమీప భవిష్యత్తులో ఈ సినిమా చేసే అవకాశాలు కనిపించడం లేదు. జక్కన్నతో సినిమా చేయాలంటే మూడేళ్లయినా ఆగాలి. ఆర్కా మీడియా వారికి అంత వరకు ఆగే ఉద్దేశం లేదు. వారి దృష్టిలో వేరే దర్శకుడు ఉన్నాడన్నది విశ్వసనీయ సమాచారం.
విలక్షణ దర్శకుడు క్రిష్తో ప్రభాస్ హీరోగా సినిమా చేయాలన్నది శోభు, ప్రసాద్ల ఆలోచన. వీరితో క్రిష్కు మంచి అనుబంధమే ఉంది. ‘వేదం’ సినిమాకు శోభు, ప్రసాద్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు కూడా. క్రిష్తో కలిసి ఒక కథ మీద శోభు, ప్రసాద్ చాన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు.
ఇంకా కథ ఒక కొలిక్కి రాలేదు కానీ.. ఈ లోపే ప్రభాస్ వారికి సినిమా చేయడానికి మాట ఇచ్చాడు. ఎలాగైనా ఈ కథను వర్కవుట్ చేసి ప్రభాస్, క్రిష్ కాంబినేషన్లో సినిమా చేయాలన్నది ఆర్కా మీడియా వారి ఆలోచన. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్తో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి భారీ చిత్రం తీసిన అనుభవంతో ప్రభాస్తోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథను తీయాలని క్రిష్ భావిస్తున్నాడు. శోభు, ప్రసాద్లకు మంచి అభిరుచి, ప్రొడక్షన్ మీద పట్టు ఉండటంతో ఈ కలయికలో ఒక మెగా మూవీని ఆశించవచ్చు.
This post was last modified on April 25, 2023 5:49 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…