Movie News

‘ఇస్మార్ట్’ జోడీ.. ‘ఇస్మార్ట్’ డేట్‌కే..

‘లైగర్’ సినిమా చూసి అందరూ పూరి జగన్నాథ్ మీద నమ్మకం కోల్పోయారు. ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ జనాలు పూరిని ఎంతమాత్రం నమ్మే పరిస్థితి లేదు. చివరికి ‘లైగర్’లో నటించిన విజయ్ దేవరకొండ సైతం ‘జనగణమన’ చేయలేక తప్పుకున్నాడు. అతను ఓకే అన్నా ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టమే అని పూరి కూడా డ్రాప్ అయిపోయాడు. పూరిని నమ్మి ఈ పరిస్థితుల్లో ఏ స్టార్ హీరో కూడా డేట్లు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

దీంతో ఆరు నెలలకు పైగా ఖాళీగా ఉండిపోయాడు పూరి. ఆయన కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు కొత్త కాదు కానీ.. ఇలా ఇంకో సినిమా ఛాన్స్ లేక ఖాళీగా ఉండటం మాత్రం ఎన్నడూ జరగలేదు. చివరికి పూరిని కష్టకాలంలో ఆదుకోవడానికి యంగ్ హీరో రామ్‌యే ముందుకు వచ్చాడు. ఇంతకుముందు పూరి స్లంప్‌లో ఉండగా.. వద్దు వద్దన్నా వినకుండా ‘ఇస్మార్ట్ శంకర్’ చేశాడు. అది ఇద్దరికీ మంచి ఫలితాన్నే ఇచ్చింది.

ఇప్పుడు పూరి మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా.. రామ్ ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. వీరి కలయికలో సినిమాకు స్క్రిప్టు రెడీ అవుతోంది. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. ఇంతకుముందులా కాకుండా ఈసారి పూరి కొంచెం ఎక్కువ టైమే తీసుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.

అక్టోబరు సమయానికి సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అంతా పూర్తి చేసి జులై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. జులై 18 అంటే అందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ గుర్తుకొస్తోంది. ఆ రోజే సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. ఈ డేట్‌ను పూరి-రామ్ జోడీ సెంటిమెంటుగా భావిస్తోందన్నమాట.

This post was last modified on April 25, 2023 5:36 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

12 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

14 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

15 hours ago

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…

16 hours ago

జాన్వీకి చుక్కలు చూపించిన క్రికెట్

ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…

16 hours ago

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

18 hours ago