‘సైరా’ తర్వాత వరుసబెట్టి సినిమాలు ఒప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఉన్నట్లుండి తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాడు. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో నటిస్తున్న చిరు.. ముందు అనుకున్న ప్రకారం అయితే వెంకీ కుడుములతో సినిమా చేయాల్సింది. కానీ కథ విషయంలో సంతృప్తి చెందక ఆ చిత్రాన్ని పక్కన పెట్టాడు. ఇంకో రెండు నెలల్లో ‘భోళా శంకర్’ను పూర్తి చేయనున్న చిరు.. ఆ తర్వాత పట్టాలెక్కించాల్సిన సినిమా కోసం కథలు వింటున్నారు.
ఐతే ఒకటి రెండు అని కాకుండా ఆయన చాలా ఆప్షన్లే లైన్లో పెట్టుకున్నాడు. చిరును ఎలాగైనా మెప్పించాలని వశిష్ఠ (బింబిసార ఫేమ్)తో పాటు బీవీఎస్ రవి, కళ్యాణ్ కృష్ణ, ప్రసన్న కుమార్ బెజవాడ ప్రయత్నిస్తున్నారు. వీళ్లందరూ చిరుకు లైన్ వినిపించి.. ఫుల్ స్క్రిప్టు మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో కొత్త పేరు వచ్చినట్లు తాజా సమాచారం.
ఇటీవలే ‘దసరా’ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద చిరు దృష్టి పడ్డట్లు సమాచారం. ‘దసరా’ను నిర్మించిన సుధాకర్ చెరుకూరికే తన రెండో సినిమాను కూడా చేయబోతున్నాడు శ్రీకాంత్. చిరుతో ఎలా యాక్సెస్ దొరికిందో కానీ.. అతను ఆయనకు ఒక లైన్ చెప్పినట్లు సమాచారం. మిగతా వాళ్లకు చెప్పినట్లే శ్రీకాంత్కు కూడా ప్రాథమికంగా హామీ ఇచ్చి.. కథ మీద వర్క్ చేసుకున్నారట చిరు. అంటే లైన్ ఓకే, ఫుల్ స్క్రిప్టు కూడా నచ్చితే సినిమా చేస్తా అన్నది ఆయన మాట.
దసరా చూసి ఇంప్రెస్ అయిన చిరు.. మంచి కథ చెబితే మిగతా వాళ్లను పక్కన పెట్టి శ్రీకాంత్తో సినిమా చేయడానికి రెడీ అన్నట్లే. మరి శ్రీకాంత్ ఇప్పుడు ఎంత మంచి కథతో వస్తాడు అన్నది కీలకం. అతడికి రెండు నెలల సమయం ఉంది. శ్రీకాంత్ ప్రస్తుతం తనకు పరిచయం ఉన్న మంచి రైటర్లతో కలిసి కథ వండే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
This post was last modified on April 25, 2023 2:01 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…