టాలెంట్ ఉండాలే కానీ కొత్త పాత సంబంధం లేకుండా దర్శకులు ఎవరైనా సరే మెప్పించే కంటెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చని 2023 వేసవిలో ముగ్గురు దర్శకులు నిరూపించారు. ఒకపక్క క్రియేటివ్ లెజెండరీ అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్లు పట్టుమని మూడు రోజులు ఆడలేని చిత్రాలతో నీరసం తెప్పిస్తుంటే మరోవైపు సృజనాత్మకతకు బడ్జెట్ లు బౌండరీలు అవసరం లేదని మరికొందరు నిరూపిస్తున్నారు. ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వేణు యెల్దండి. ప్రియదర్శి లాంటి ఒకరిద్దరు తప్ప పేరున్న క్యాస్టింగ్ లేకుండా తీసిన బలగం తెలంగాణలో మారుమూల పల్లెలకు చొచ్చుకుపోయింది.
కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రంలో ఎనభై లక్షలు వసూలు చేసినా, హైదరాబాద్ లో యాభై రోజులు ఆడినా, జనం మైదానాలలో షోలు వేసుకున్నా అదంతా బలగంలోని భావోద్వేగాలకు బలంగా కనెక్ట్ అవ్వడం వల్లే. బ్లాక్ బస్టర్ అనే పదం దీని ముందు చిన్నదే. రెండో పేరు శ్రీకాంత్ ఓదెల. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాని లాంటి న్యాచురల్ స్టార్ ని ఊర మాస్ పాత్రలో చూపించిన దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు దాటేసి ఔరా అనిపించుకుంది. సుకుమార్ శిష్యరికంలో ఆరితేరిన శ్రీకాంత్ నుంచి అంత గొప్ప అవుట్ ఫుట్ ఎవరూ ఊహించలేదన్న మాట వాస్తవం.
ఇక మూడో వ్యక్తి కార్తీక్ దండు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం భం బోలేనాథ్ అనే చిన్న సినిమాతో ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన ఇతను ఇంత సుధీర్ఘమైన నిరీక్షణకు తెరదించుంటూ ఒక హారర్ సబ్జెక్టుతో విరూపాక్ష రూపంలో ఘనవిజయం సాధించడం చిన్న విషయం కాదు. యాక్సిడెంట్ వల్ల విశ్రాంతి, రిపబ్లిక్ ఫ్లాప్ లాంటి గాయాల నుంచి బలమైన కంబ్యాక్ కోరుకున్న సాయిధరమ్ తేజ్ కి పెద్ద హిట్టు చేతిలో పెట్టాడు. మాడుపగిలిపోయే ఎండల్లో బయటికి రావాలా వద్దాని జనం తటపటాయిస్తున్న ట్రెండ్ లో ఇంత సక్సెస్ అందుకున్న ఈ ముగ్గురూ అసాధ్యులు కాక మరేమిటి
This post was last modified on April 24, 2023 12:44 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…