టాలెంట్ ఉండాలే కానీ కొత్త పాత సంబంధం లేకుండా దర్శకులు ఎవరైనా సరే మెప్పించే కంటెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చని 2023 వేసవిలో ముగ్గురు దర్శకులు నిరూపించారు. ఒకపక్క క్రియేటివ్ లెజెండరీ అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్లు పట్టుమని మూడు రోజులు ఆడలేని చిత్రాలతో నీరసం తెప్పిస్తుంటే మరోవైపు సృజనాత్మకతకు బడ్జెట్ లు బౌండరీలు అవసరం లేదని మరికొందరు నిరూపిస్తున్నారు. ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వేణు యెల్దండి. ప్రియదర్శి లాంటి ఒకరిద్దరు తప్ప పేరున్న క్యాస్టింగ్ లేకుండా తీసిన బలగం తెలంగాణలో మారుమూల పల్లెలకు చొచ్చుకుపోయింది.
కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రంలో ఎనభై లక్షలు వసూలు చేసినా, హైదరాబాద్ లో యాభై రోజులు ఆడినా, జనం మైదానాలలో షోలు వేసుకున్నా అదంతా బలగంలోని భావోద్వేగాలకు బలంగా కనెక్ట్ అవ్వడం వల్లే. బ్లాక్ బస్టర్ అనే పదం దీని ముందు చిన్నదే. రెండో పేరు శ్రీకాంత్ ఓదెల. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాని లాంటి న్యాచురల్ స్టార్ ని ఊర మాస్ పాత్రలో చూపించిన దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు దాటేసి ఔరా అనిపించుకుంది. సుకుమార్ శిష్యరికంలో ఆరితేరిన శ్రీకాంత్ నుంచి అంత గొప్ప అవుట్ ఫుట్ ఎవరూ ఊహించలేదన్న మాట వాస్తవం.
ఇక మూడో వ్యక్తి కార్తీక్ దండు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం భం బోలేనాథ్ అనే చిన్న సినిమాతో ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన ఇతను ఇంత సుధీర్ఘమైన నిరీక్షణకు తెరదించుంటూ ఒక హారర్ సబ్జెక్టుతో విరూపాక్ష రూపంలో ఘనవిజయం సాధించడం చిన్న విషయం కాదు. యాక్సిడెంట్ వల్ల విశ్రాంతి, రిపబ్లిక్ ఫ్లాప్ లాంటి గాయాల నుంచి బలమైన కంబ్యాక్ కోరుకున్న సాయిధరమ్ తేజ్ కి పెద్ద హిట్టు చేతిలో పెట్టాడు. మాడుపగిలిపోయే ఎండల్లో బయటికి రావాలా వద్దాని జనం తటపటాయిస్తున్న ట్రెండ్ లో ఇంత సక్సెస్ అందుకున్న ఈ ముగ్గురూ అసాధ్యులు కాక మరేమిటి
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…