Movie News

మూడు రోజులకే ఇంత అరాచకమా

బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష దూకుడు మాములుగా లేదు. అసలే పోటీ లేని అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటూ మొదటి వీకెండ్ ని గ్రాండ్ గా ముగించింది. తెలుగు రాష్ట్రాల్లో కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ ఫలితంతో పాటు అంతకు ముందు వారం వచ్చిన శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 అన్నీ ఫైనల్ రన్ కు దగ్గరవ్వడంతో సాయి ధరమ్ తేజ్ కి బ్రేకులు లేకుండా పోయాయి. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో ఆ ఆనందం ప్రతి ఒక్కరి మొహంలో స్పష్టంగా కనిపించింది. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో ఆదివారం మొత్తం హౌస్ ఫుల్స్ పడటమే దీనికి నిదర్శనం

థియేటర్ బిజినెస్ చేసుకున్న టైంలో పాతిక కోట్ల టార్గెట్ ని చేరుకోవడం అసాధ్యమేమో అన్న అనుమానాలు బద్దలు కొడుతూ కేవలం మూడు రోజులకే 20 కోట్ల షేర్ ని దాటేయడం మీడియం రేంజ్ హీరోకి చాలా అరుదు. అందులోనూ తేజు ఫామ్ లో లేడు.

యాక్సిడెంట్ వల్ల వచ్చిన బ్రేక్, రిపబ్లిక్ ఫ్లాప్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాయి. అందుకే ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా మొదలయ్యాయి. కట్ చేస్తే ఫస్ట్ డే సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 16 కోట్లకు పైగా షేర్ రావడం బ్లాక్ బస్టర్ కు నిదర్శనం. వరల్డ్ వైడ్ గ్రాస్ 37 కోట్ల దాకా వచ్చింది.

ఇవాళ సోమవారం కాబట్టి సహజంగానే డ్రాప్ ఉంటుంది కానీ అది ఎంత శాతం అనేది వేచి చూడాలి. సాధారణంగా వీక్ డేస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా డైరెక్ట్ కౌంటర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేవలం ఆన్ లైన్ లో చూసి ఒక అంచనాకు రాలేం. ఒకవేళ ఈ రోజు రేపు కనక స్టడీగా ఉంటే ఇంకో వారం దాకా అడ్డుకట్ట పడకపోవచ్చు. కాకపోతే శుక్రవారం ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 వస్తున్నాయి కాబట్టి స్క్రీన్ కౌంట్ పరంగా విరూపాక్ష మీద గట్టి ప్రభావం పడుతుంది. వాటి టాక్ ని బట్టి మళ్ళీ నిలదొక్కుకోవడమా లేక నెమ్మదించడమా చూడాలి.

This post was last modified on April 24, 2023 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

50 minutes ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

52 minutes ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

12 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago