Movie News

పుష్ప ఎఫెక్ట్‌: వైసీపీ మాజీ మంత్రి ఫైర్‌

మాస్ ప్రేక్ష‌కులను ఉర్రూత‌లూగించిన బ‌న్నీ మూవీ పుష్ప సినీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారం వైసీపీ నేత‌, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డికి కూడా చుట్టుకుంది. మైత్రీ మూవీస్‌లో ఆయ‌న పెట్టుబ‌డులు పెట్టారంటూ.. టీడీపీ నేత‌లు కొంద‌రు వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన బాలినేని మైత్రీ మూవీస్లో తనకు గానీ తన వియ్యంకుడికి గానీ పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే ఇద్దరి ఆస్తులు రాసిస్తామని స‌వాల్ రువ్వారు.

అంతే కాదు, తాను రాజ‌కీయాల నుంచి కూడా తప్పుకుంటానని అన్నారు. మైత్రి మూవీస్లో తనకు పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్, కొంద‌రు టీడీపీ నేత‌లు ఆరోపించారని… ఈ ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని ఆయన అన్నారు. మైత్రి మూవీస్లో కొద్ది రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఐటీ శాఖను తన మీదకు ఉసిగొలిపే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండపడ్డారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సినిమా వాళ్లే కాబట్టి.. సినిమా సంబంధాలు ఉన్నందున ఆయన విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని… ఆయన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణ చేయడంతో పాటు.. తాజాగా నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కొంద‌రు టీడీపీ నేత‌లు ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on April 24, 2023 11:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

15 mins ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

1 hour ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

3 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

4 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

4 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

10 hours ago