మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బన్నీ మూవీ పుష్ప సినీ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం వైసీపీ నేత, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా చుట్టుకుంది. మైత్రీ మూవీస్లో ఆయన పెట్టుబడులు పెట్టారంటూ.. టీడీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా రియాక్ట్ అయిన బాలినేని మైత్రీ మూవీస్లో తనకు గానీ తన వియ్యంకుడికి గానీ పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే ఇద్దరి ఆస్తులు రాసిస్తామని సవాల్ రువ్వారు.
అంతే కాదు, తాను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అన్నారు. మైత్రి మూవీస్లో తనకు పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్, కొందరు టీడీపీ నేతలు ఆరోపించారని… ఈ ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని ఆయన అన్నారు. మైత్రి మూవీస్లో కొద్ది రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఐటీ శాఖను తన మీదకు ఉసిగొలిపే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సినిమా వాళ్లే కాబట్టి.. సినిమా సంబంధాలు ఉన్నందున ఆయన విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని… ఆయన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణ చేయడంతో పాటు.. తాజాగా నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు టీడీపీ నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…