హాలీవుడ్ లో క్రేజీ హారర్ మూవీ సిరీస్ గా పేరున్న ఎవిల్ డెడ్ కొత్త భాగం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. 1981 తో మొదలుపెట్టి ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఇది అయిదో భాగం. టైటిల్ కి రైజ్ అని జోడించి ట్రైలర్ దశ నుంచే ఆసక్తి పెరిగేలా చేశారు. ఎన్నడూ లేనిది దెయ్యాల సినిమాకు ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ఒక్క దీని విషయంలోనే జరిగింది. అంతగా ఆత్మల ప్రియులు ఈ మూవీ కోసం ఎదురు చూశారు. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అంతగా ఇందులో ఏముందనే ఆసక్తి రేగడం సహజం. అదేంటో చూద్దాం.
ట్రెడిషనల్ గా ఎప్పుడూ అడవిలో సాగే ఎవిల్ డెడ్ ని ఈసారి నగరానికి మార్చారు. అక్క ఎల్లి(అల్లీసా సదర్లాండ్)ని కలుసుకోవడం కోసం ఆమె ఉండే అపార్ట్ మెంట్ కు వస్తుంది బెత్(లిలీ సులివాన్). ఆమె కొడుకు సెల్లార్ లో అనుకోకుండా దొరికిన ఓ పాత పుస్తకం, కొన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు ఫ్లాట్ కి తీసుకోచ్చి వాటిని చదివి ప్లే చేస్తాడు. దీంతో దెయ్యం బయటికి వచ్చి ఎల్లీని ఆవహించి ఒక్కొక్కరిని చంపడం వాళ్ళను భూతంగా మార్చడం మొదలుపెడుతుంది. దీంతో చిన్న కూతురుని తీసుకుని బేస్ మెంట్ కు పరిగెత్తిన బెత్ చివరికి ఎలా ప్రాణాలతో బయటపడిందన్నదే స్టోరీ.
విపరీతమైన హింసతో ఒళ్ళు గగుర్పొడిచే భయానక భీభత్స దృశ్యాలతో ఈవిల్ డెడ్ రైజ్ ని రూపొందించాడు దర్శకుడు లీ క్రోనిన్. క్లైమాక్స్ లో లిఫ్ట్ లో రక్తం సముద్రంగా ప్రవహించే ఎపిసోడ్, దెయ్యాలన్నీ ఓ విచిత్ర ఆకారంలో బెత్ వెంట పడ్డాక జరిగే దృశ్యాలు కళ్ళు మూసుకోకుండా చూడటం కష్టం. ఒకదశలో ఇంత వయొలెన్స్ చూస్తే హార్ట్ పేషెంట్స్ తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. పొరపాటున కూడా పిల్లలకు చూపించకూడని చాలా సీన్లు డిస్టర్బ్ చేస్తాయి. మొదటి రెండు భాగాలతో పోల్చుకునేంత గొప్పగా లేదు కానీ ఈ జానర్ ని విపరీతంగా ప్రేమించేవాళ్ళకు నచ్చుతుంది. మిగిలినవాళ్ళు దూరంగా ఉంటే బెటర్
This post was last modified on April 23, 2023 2:45 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…