హాలీవుడ్ లో క్రేజీ హారర్ మూవీ సిరీస్ గా పేరున్న ఎవిల్ డెడ్ కొత్త భాగం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. 1981 తో మొదలుపెట్టి ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఇది అయిదో భాగం. టైటిల్ కి రైజ్ అని జోడించి ట్రైలర్ దశ నుంచే ఆసక్తి పెరిగేలా చేశారు. ఎన్నడూ లేనిది దెయ్యాల సినిమాకు ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ఒక్క దీని విషయంలోనే జరిగింది. అంతగా ఆత్మల ప్రియులు ఈ మూవీ కోసం ఎదురు చూశారు. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అంతగా ఇందులో ఏముందనే ఆసక్తి రేగడం సహజం. అదేంటో చూద్దాం.
ట్రెడిషనల్ గా ఎప్పుడూ అడవిలో సాగే ఎవిల్ డెడ్ ని ఈసారి నగరానికి మార్చారు. అక్క ఎల్లి(అల్లీసా సదర్లాండ్)ని కలుసుకోవడం కోసం ఆమె ఉండే అపార్ట్ మెంట్ కు వస్తుంది బెత్(లిలీ సులివాన్). ఆమె కొడుకు సెల్లార్ లో అనుకోకుండా దొరికిన ఓ పాత పుస్తకం, కొన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు ఫ్లాట్ కి తీసుకోచ్చి వాటిని చదివి ప్లే చేస్తాడు. దీంతో దెయ్యం బయటికి వచ్చి ఎల్లీని ఆవహించి ఒక్కొక్కరిని చంపడం వాళ్ళను భూతంగా మార్చడం మొదలుపెడుతుంది. దీంతో చిన్న కూతురుని తీసుకుని బేస్ మెంట్ కు పరిగెత్తిన బెత్ చివరికి ఎలా ప్రాణాలతో బయటపడిందన్నదే స్టోరీ.
విపరీతమైన హింసతో ఒళ్ళు గగుర్పొడిచే భయానక భీభత్స దృశ్యాలతో ఈవిల్ డెడ్ రైజ్ ని రూపొందించాడు దర్శకుడు లీ క్రోనిన్. క్లైమాక్స్ లో లిఫ్ట్ లో రక్తం సముద్రంగా ప్రవహించే ఎపిసోడ్, దెయ్యాలన్నీ ఓ విచిత్ర ఆకారంలో బెత్ వెంట పడ్డాక జరిగే దృశ్యాలు కళ్ళు మూసుకోకుండా చూడటం కష్టం. ఒకదశలో ఇంత వయొలెన్స్ చూస్తే హార్ట్ పేషెంట్స్ తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. పొరపాటున కూడా పిల్లలకు చూపించకూడని చాలా సీన్లు డిస్టర్బ్ చేస్తాయి. మొదటి రెండు భాగాలతో పోల్చుకునేంత గొప్పగా లేదు కానీ ఈ జానర్ ని విపరీతంగా ప్రేమించేవాళ్ళకు నచ్చుతుంది. మిగిలినవాళ్ళు దూరంగా ఉంటే బెటర్
This post was last modified on April 23, 2023 2:45 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…