మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తమిళనాడులో రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పుకుంటున్న పొన్నియిన్ సెల్వన్ 1 సీక్వెల్ కి ఆశించినంత హైప్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో బజ్ అంతంతమాత్రంగా ఉండటంతో ఓపెనింగ్స్ తో పాటు బిజినెస్ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఎంత గొప్పగా ఆడినా డబ్బింగ్ లో మాత్రం పీఎస్ 1 సోసోగా ఆడిన మాట వాస్తవం. చోళుల కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జరిగిన తడబాటు వల్ల రెండో భాగం మీద ఆసక్తి రావడం లేదు.
నిన్న బెంగళూరులో ఓ ఈవెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా వేడుక జరగబోతోంది. నిర్మాత దిల్ రాజు పంపిణి చేస్తుండటంతో థియేటర్లైతే దక్కుతున్నాయి కానీ జనాన్ని రప్పించడం టీమ్ కి సవాల్ గా మారింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. రెండో వారంలో నెమ్మదించే అవకాశాలు తక్కువే. మరోవైపు ఏజెంట్ ని భారీ ఎత్తున అదే రోజున విడుదల చేస్తున్నారు. స్క్రీన్లు, బెనిఫిట్ షోలు, హంగామా దీని లెక్క వేరుగా ఉంటుంది. వీటి మధ్య పీఎస్ 2 ఆడియన్స్ కి ఆకట్టుకోవడం అంత సులభం కాదు. ఎంత గ్రాండియర్ అయినా కంటెంట్ ముఖ్యం
రాబోయే నాలుగు రోజులు పీఎస్ 2కి కీలకంగా మారబోతున్నాయి. టాక్ గొప్పగా వస్తే ఇబ్బంది లేదు కానీ ఏ మాత్రం అటుఇటు అయినా అంతే సంగతులు. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం ఏమంత చొచ్చుకుపోలేదు. ఫస్ట్ పార్ట్ అతి కష్టం మీద పది కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఇప్పుడీ రెండో భాగాన్ని ఎంతకు బిజినెస్ చేశారో ఇంకా బయటికి రావడం లేదు మొత్తానికి దానికన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. నిర్మాణ సంస్థ లైకా మాత్రం నిశ్చింతగా ఉంది. ఎలాగూ ప్రైమ్ తో భారీ ఓటిటి డీల్ జరిగిపోయింది. వేరే భాషల్లో ఆడినా ఆడకపోయినా తమిళం నుంచే గంపెడు లాభాలు మూటగట్టుకోవచ్చు.
This post was last modified on April 23, 2023 11:12 am
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…