మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తమిళనాడులో రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పుకుంటున్న పొన్నియిన్ సెల్వన్ 1 సీక్వెల్ కి ఆశించినంత హైప్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో బజ్ అంతంతమాత్రంగా ఉండటంతో ఓపెనింగ్స్ తో పాటు బిజినెస్ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ ఎంత గొప్పగా ఆడినా డబ్బింగ్ లో మాత్రం పీఎస్ 1 సోసోగా ఆడిన మాట వాస్తవం. చోళుల కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో జరిగిన తడబాటు వల్ల రెండో భాగం మీద ఆసక్తి రావడం లేదు.
నిన్న బెంగళూరులో ఓ ఈవెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా వేడుక జరగబోతోంది. నిర్మాత దిల్ రాజు పంపిణి చేస్తుండటంతో థియేటర్లైతే దక్కుతున్నాయి కానీ జనాన్ని రప్పించడం టీమ్ కి సవాల్ గా మారింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. రెండో వారంలో నెమ్మదించే అవకాశాలు తక్కువే. మరోవైపు ఏజెంట్ ని భారీ ఎత్తున అదే రోజున విడుదల చేస్తున్నారు. స్క్రీన్లు, బెనిఫిట్ షోలు, హంగామా దీని లెక్క వేరుగా ఉంటుంది. వీటి మధ్య పీఎస్ 2 ఆడియన్స్ కి ఆకట్టుకోవడం అంత సులభం కాదు. ఎంత గ్రాండియర్ అయినా కంటెంట్ ముఖ్యం
రాబోయే నాలుగు రోజులు పీఎస్ 2కి కీలకంగా మారబోతున్నాయి. టాక్ గొప్పగా వస్తే ఇబ్బంది లేదు కానీ ఏ మాత్రం అటుఇటు అయినా అంతే సంగతులు. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం ఏమంత చొచ్చుకుపోలేదు. ఫస్ట్ పార్ట్ అతి కష్టం మీద పది కోట్లకు దగ్గరగా వెళ్ళింది. ఇప్పుడీ రెండో భాగాన్ని ఎంతకు బిజినెస్ చేశారో ఇంకా బయటికి రావడం లేదు మొత్తానికి దానికన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. నిర్మాణ సంస్థ లైకా మాత్రం నిశ్చింతగా ఉంది. ఎలాగూ ప్రైమ్ తో భారీ ఓటిటి డీల్ జరిగిపోయింది. వేరే భాషల్లో ఆడినా ఆడకపోయినా తమిళం నుంచే గంపెడు లాభాలు మూటగట్టుకోవచ్చు.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…