కరోనా తర్వాత బాలీవుడ్ టాప్ స్టార్లలో చాలామంది తమ స్టార్ డమ్, మార్కెట్ దెబ్బ తిని ఇబ్బంది పడుతున్న వాళ్లే. ఒకప్పటిలా వాళ్లు ఏం చేసినా చూసే పరిస్థితి లేదు. సినిమా టాక్తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు వచ్చి పడిపోవట్లేదు. రకరకాల అంశాలు కలిసి వచ్చి షారుఖ్ సినిమా ‘పఠాన్’ ఇరగాడేసింది కానీ.. మిగతా టాప్ స్టార్లందరికీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి.
ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ దెబ్బకు సినిమాలు మానేసి కూర్చున్నాడు. అక్షయ్ కుమార్ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇక సల్మాన్ ఖాన్ సంగతి ఏమవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కరోనా ప్రభావం మొదలయ్యాక సల్మాన్ ఖాన్ సినిమా ఏదీ కూడా థియేటర్లలో రిలీజ్ కాలేదు.
‘రాధే’ మూవీ ఓటీటీలో రిలీజై దారుణమైన టాక్ తెచ్చుకుంది. మరి మూడేళ్లకు పైగా గ్యాప్ తర్వాత వస్తున్న సల్మాన్ థియేట్రికల్ రిలీజ్ ‘కిసీ కీ భాయ్ కిసీ కా జాన్’ మీద అందరి దృష్టి నిలిచింది. ఐతే ఈ సినిమా ప్రోమోలు చూస్తేనే తేడాగా అనిపించగా.. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లకు దిమ్మదిరిగింది.
మరీ రొడ్డకొట్టుడు స్టయిల్లో తీసిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సల్మాన్కు బేసిగ్గా ఉండే మాస్ ఫాలోయింగ్ వల్ల తొలి రోజు థియేటర్లలో కొంచెం సందడి కనిపించింది కానీ.. ఇది నిలబడే సినిమా కాదని తొలి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రానికి శుక్రవారం రూ.15 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.
కరోనా తర్వాత వేరే పెద్ద హీరోల సినిమాలకు వచ్చిన వసూళ్లతో పోలిస్తే ఇది పర్వాలేదనిపించే నంబరే. కానీ సల్మాన్ స్థాయికి, కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ బడ్జెట్, బిజినెస్ కోణంలో చూస్తే మాత్రం చాలా తక్కువ. గత పదేళ్లలో మరే సల్మాన్ సినిమాకూ ఇంత తక్కువ వసూళ్లు రాలేదు. వీకెండ్ తర్వాత థియేటర్లు వెలవెలబోయేలా కనిపిస్తున్న సినిమాకు తొలి రోజు ఈ వసూళ్లంటే చాలా కష్టం అన్నట్లే. వీకెండ్ అయ్యేసరికి మహా అయితే 50-60 కోట్లు రావచ్చు.
ఫుల్ రన్లో వంద కోట్లు కూడా కష్టమే కావచ్చు. మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు. ఎంత నాన్-థియేట్రికల్ బిజినెస్ కలుపుకున్నా కూడా ఈ సినిమా భారీ నష్టాలు తెచ్చిపెట్టబోతున్నట్లే.
This post was last modified on April 23, 2023 7:52 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…