Movie News

లైగర్ దెబ్బకి పూరి మాయం

దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా పూరీ తీసిన సినిమాలు , హీరో పాత్రలు , డైలాగులు వింటూ ,చూస్తూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు సినీ జనాలు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ తీసిన సినిమాలు చూసి అతని కం బ్యాక్ కోసం ఎదురుచూసిన మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కోరుకున్నట్టే పూరీ ఇస్మార్ట్ తో ఐయామ్ బ్యాక్ అనిపించుకొని మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.

ఆ తర్వాత విజయ్ తో ‘లైగర్’ తీసి ఎవరూ ఊహించని విధంగా ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు రకాలుగా నష్ట పోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఎటూ కదలడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పూరీ హైదరాబాద్ లో ఉన్నాడా ? లేదా ముంబై లో ఉన్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. పూరీ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరమయ్యాడు. ఇక పూరీ నుండి పోడ్ కాస్ట్ వచ్చి కూడా నెల దాటేసింది. బహుశా రహస్యంగా ఎక్కడో తన పని తను చేసుకుంటున్నాడేమో.

పూరీ నెక్స్ట్ సినిమా చిరుతో అని కొందరు , బాలయ్యతో అని మరికొందరు అంటుంటే తాజాగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీసే ఆలోచనలో ఉన్నాడని గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనా లైగర్ దెబ్బకి పూరీ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. మళ్ళీ పూరీ మీడియా ముందుకొచ్చేది కొత్త సినిమా ఓపెనింగ్ కే అనిపిస్తుంది.

This post was last modified on April 23, 2023 7:45 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రౌడీ హీరోతో సుకుమార్ సినిమా – ఛాన్స్ ఉందా

వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…

3 hours ago

అనుమానపడుతూనే అనిరుధ్ మీద పొగడ్తలు

నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…

5 hours ago

ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…

6 hours ago

కల్కిలో కమల్ హాసన్ షాకింగ్ నిడివి

ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…

6 hours ago

నోరు జారానా? ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నం..!

కాలు జారితే తీసుకోవ‌చ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవ‌డం క‌ష్టం. పైగా ఇది ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు కూడా సంబంధించిన…

7 hours ago

పోలింగ్ ఎఫెక్ట్‌: 100 మంది అరెస్టు.. 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస‌..…

8 hours ago