దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా పూరీ తీసిన సినిమాలు , హీరో పాత్రలు , డైలాగులు వింటూ ,చూస్తూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు సినీ జనాలు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ తీసిన సినిమాలు చూసి అతని కం బ్యాక్ కోసం ఎదురుచూసిన మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కోరుకున్నట్టే పూరీ ఇస్మార్ట్ తో ఐయామ్ బ్యాక్ అనిపించుకొని మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత విజయ్ తో ‘లైగర్’ తీసి ఎవరూ ఊహించని విధంగా ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు రకాలుగా నష్ట పోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఎటూ కదలడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పూరీ హైదరాబాద్ లో ఉన్నాడా ? లేదా ముంబై లో ఉన్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. పూరీ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరమయ్యాడు. ఇక పూరీ నుండి పోడ్ కాస్ట్ వచ్చి కూడా నెల దాటేసింది. బహుశా రహస్యంగా ఎక్కడో తన పని తను చేసుకుంటున్నాడేమో.
పూరీ నెక్స్ట్ సినిమా చిరుతో అని కొందరు , బాలయ్యతో అని మరికొందరు అంటుంటే తాజాగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీసే ఆలోచనలో ఉన్నాడని గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనా లైగర్ దెబ్బకి పూరీ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. మళ్ళీ పూరీ మీడియా ముందుకొచ్చేది కొత్త సినిమా ఓపెనింగ్ కే అనిపిస్తుంది.
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…