దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా పూరీ తీసిన సినిమాలు , హీరో పాత్రలు , డైలాగులు వింటూ ,చూస్తూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు సినీ జనాలు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ తీసిన సినిమాలు చూసి అతని కం బ్యాక్ కోసం ఎదురుచూసిన మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కోరుకున్నట్టే పూరీ ఇస్మార్ట్ తో ఐయామ్ బ్యాక్ అనిపించుకొని మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత విజయ్ తో ‘లైగర్’ తీసి ఎవరూ ఊహించని విధంగా ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు రకాలుగా నష్ట పోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఎటూ కదలడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పూరీ హైదరాబాద్ లో ఉన్నాడా ? లేదా ముంబై లో ఉన్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. పూరీ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరమయ్యాడు. ఇక పూరీ నుండి పోడ్ కాస్ట్ వచ్చి కూడా నెల దాటేసింది. బహుశా రహస్యంగా ఎక్కడో తన పని తను చేసుకుంటున్నాడేమో.
పూరీ నెక్స్ట్ సినిమా చిరుతో అని కొందరు , బాలయ్యతో అని మరికొందరు అంటుంటే తాజాగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీసే ఆలోచనలో ఉన్నాడని గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనా లైగర్ దెబ్బకి పూరీ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. మళ్ళీ పూరీ మీడియా ముందుకొచ్చేది కొత్త సినిమా ఓపెనింగ్ కే అనిపిస్తుంది.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…