దర్శకుల్లో పూరీ జగన్నాథ్ కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. కొన్నేళ్ళుగా పూరీ తీసిన సినిమాలు , హీరో పాత్రలు , డైలాగులు వింటూ ,చూస్తూ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు సినీ జనాలు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు పూరీ తీసిన సినిమాలు చూసి అతని కం బ్యాక్ కోసం ఎదురుచూసిన మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ కోరుకున్నట్టే పూరీ ఇస్మార్ట్ తో ఐయామ్ బ్యాక్ అనిపించుకొని మళ్ళీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత విజయ్ తో ‘లైగర్’ తీసి ఎవరూ ఊహించని విధంగా ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా రెండు రకాలుగా నష్ట పోయాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఎటూ కదలడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి పూరీ హైదరాబాద్ లో ఉన్నాడా ? లేదా ముంబై లో ఉన్నాడా ? అనేది ఎవరికీ తెలియడం లేదు. పూరీ ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాకి కూడా దూరమయ్యాడు. ఇక పూరీ నుండి పోడ్ కాస్ట్ వచ్చి కూడా నెల దాటేసింది. బహుశా రహస్యంగా ఎక్కడో తన పని తను చేసుకుంటున్నాడేమో.
పూరీ నెక్స్ట్ సినిమా చిరుతో అని కొందరు , బాలయ్యతో అని మరికొందరు అంటుంటే తాజాగా పూరీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తీసే ఆలోచనలో ఉన్నాడని గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనా లైగర్ దెబ్బకి పూరీ ఎక్కడా కనిపించకుండా మాయమైపోయాడు. మళ్ళీ పూరీ మీడియా ముందుకొచ్చేది కొత్త సినిమా ఓపెనింగ్ కే అనిపిస్తుంది.
This post was last modified on April 23, 2023 7:45 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…