Movie News

ఏజెంట్ బృందానికి ఊహించని షాక్

అఖిల్ ఏజెంట్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. రేపు వరంగల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడం ఖాయమే కానీ యూనిట్ దాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టిని ప్రమోషన్లలో భాగం చేసేందుకు టీమ్ సన్నద్ధంగా ఉన్న టైంలో ఊహించని షాక్ తగిలింది. మలయాళం మెగాస్టార్ తల్లి ఫాతిమా ఇస్మాయిల్ అనారోగ్యంతో నిన్న తుది శ్వాస తీసుకున్నారు

దీంతో మమ్ముట్టి రేపు అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యం. డేట్ల సమస్య వల్ల కాకినాడలో జరిగిన ట్రైలర్ లాంచ్ మిస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆవిడ వయసు 93 సంవత్సరాలు. అయిదుగురు పిల్లల్లో మమ్ముట్టి ఒకరు. కొడుకు, మనవడు దుల్కర్ సినీ ప్రస్థానాన్ని కళ్లారా చూసుకుని సెలవు తీసుకున్నారు. ఏజెంట్ హీరో అఖిలే అయినా కేరళలో మార్కెట్ చేయడానికి మమ్ముట్టి హాజరు చాలా కీలకం. అక్కడి అభిమానులు ఏజెంట్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వడానికి కారణం ఇదే. అలాంటప్పుడు మమ్ముట్టి లేకుండా ప్రచారం చేయడం కష్టం.

ఇలాంటి ఊహించని అవాంతరాలు ఏజెంట్ ను ముందు నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. ట్రైలర్ లో సగం వరకే మమ్ముట్టి స్వంత గొంతు ఉంది. ఆ తర్వాత వేరే వాయిస్ ఉంది. అంటే ఇంకా డబ్బింగ్ పూర్తి కాలేదని అర్థమైపోయింది. సెన్సార్ చేయించారు కానీ సినిమాలో ఎవరి గొంతు పూర్తిగా వినిపిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 28 ఏజెంట్ తో పాటు విడుదల కాబోతున్న పొన్నియిన్ సెల్వం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే టైంలో హైదరాబాద్ లో చేయబోతున్నారు. మొత్తానికి రెండింటి మధ్య క్లాష్ నువ్వా నేనా అనేలా ఉంది కానీ ఏజెంట్ మీదున్న ఆసక్తిలో పీఎస్ 2 మీద సగం కూడా లేదన్నది వాస్తవం

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

41 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

1 hour ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

2 hours ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

2 hours ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago