అఖిల్ ఏజెంట్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. రేపు వరంగల్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడం ఖాయమే కానీ యూనిట్ దాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు. రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన మమ్ముట్టిని ప్రమోషన్లలో భాగం చేసేందుకు టీమ్ సన్నద్ధంగా ఉన్న టైంలో ఊహించని షాక్ తగిలింది. మలయాళం మెగాస్టార్ తల్లి ఫాతిమా ఇస్మాయిల్ అనారోగ్యంతో నిన్న తుది శ్వాస తీసుకున్నారు
దీంతో మమ్ముట్టి రేపు అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యం. డేట్ల సమస్య వల్ల కాకినాడలో జరిగిన ట్రైలర్ లాంచ్ మిస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆవిడ వయసు 93 సంవత్సరాలు. అయిదుగురు పిల్లల్లో మమ్ముట్టి ఒకరు. కొడుకు, మనవడు దుల్కర్ సినీ ప్రస్థానాన్ని కళ్లారా చూసుకుని సెలవు తీసుకున్నారు. ఏజెంట్ హీరో అఖిలే అయినా కేరళలో మార్కెట్ చేయడానికి మమ్ముట్టి హాజరు చాలా కీలకం. అక్కడి అభిమానులు ఏజెంట్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వడానికి కారణం ఇదే. అలాంటప్పుడు మమ్ముట్టి లేకుండా ప్రచారం చేయడం కష్టం.
ఇలాంటి ఊహించని అవాంతరాలు ఏజెంట్ ను ముందు నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. ట్రైలర్ లో సగం వరకే మమ్ముట్టి స్వంత గొంతు ఉంది. ఆ తర్వాత వేరే వాయిస్ ఉంది. అంటే ఇంకా డబ్బింగ్ పూర్తి కాలేదని అర్థమైపోయింది. సెన్సార్ చేయించారు కానీ సినిమాలో ఎవరి గొంతు పూర్తిగా వినిపిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఏప్రిల్ 28 ఏజెంట్ తో పాటు విడుదల కాబోతున్న పొన్నియిన్ సెల్వం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే టైంలో హైదరాబాద్ లో చేయబోతున్నారు. మొత్తానికి రెండింటి మధ్య క్లాష్ నువ్వా నేనా అనేలా ఉంది కానీ ఏజెంట్ మీదున్న ఆసక్తిలో పీఎస్ 2 మీద సగం కూడా లేదన్నది వాస్తవం
This post was last modified on April 22, 2023 9:14 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…