ఏదో డిఫరెంట్ గా ట్రై చేయాలని తపించే హీరో సుధీర్ బాబు. ఆ మధ్య హంట్ లో ఒక షాకింగ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను థ్రిల్ చేద్దామనుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అంతకు ముందు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలికీ ఇదే రిజల్ట్ వచ్చింది. అయినా సరే రూటు మారకుండా రెగ్యులర్ ఫార్ములాని టచ్ చేయకుండా మరో ఎక్స్ పరిమెంట్ కు సిద్ధమయ్యాడు. అదే మామా మశ్చీంద్ర. నటుడు కం దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ని మహేష్ బాబు ద్వారా విడుదల చేయించారు.
వీడియో నిమిషంన్నరలోపే ఉన్నప్పటికీ ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశాయి. మంచివాడిగా ఏడు జన్మలు ఎత్తడం కన్నా రాక్షసుడిగా మూడు సార్లు పుడితే చాలని నమ్మే ఒక వ్యక్తి(సుధీర్ బాబు)ని పోలిన మనుషులు మరో ఇద్దరు ఉంటారు. అందులో ఒకడు వయసైపోయిన పెద్దాయన కాగా ఒకడు స్థూలకాయంతో బాధపడే మనిషి ఇంకొకడు చలాకీగా జీవితం గడిపే యువకుడు. వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఏజ్డ్ గా కనిపించే ముసలాయన మిగిలిన వాళ్ళను ఎందుకు చంపాలనుకుంటున్నాడు లాంటి ట్విస్టులేవో గట్టిగానే సెట్ చేశారు.
మాయ చేసే మూడు పాత్రల్లో సుధీర్ బాబు బాగా కష్టపడినట్టు ఉంది. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించిన మామా మశ్చీంద్రకు చైతన్ భరద్వాజ్ సంగీతంసమకూర్చారు. ట్రిపుల్ రోల్స్ పరంగా ఆ మధ్య కళ్యాణ్ రామ్ చేసిన అమిగోస్ ఛాయలు కొంత కనిపించినప్పటికీ హర్షవర్ధన్ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరేలా ఉంది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయలేదు కానీ ఈ వేసవిలోనే మంచి పోటీ లేని టైం చూసి థియేటర్లలో వదిలేందుకు రెడీ అవుతున్నారు. ఈసారైనా సుధీర్ బాబు కోరుకున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఈ మశ్చీంద్ర అందిస్తాడో లేదో త్వరలోనే తేలనుంది
This post was last modified on April 22, 2023 11:17 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…