నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ తాను సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ గమనించి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో చూసి ఇది తీశానని నొక్కి చెప్పాడు. పిల్లలు, సున్నిత మనస్కులు దూరంగా ఉండమని హింట్ కూడా ఇచ్చాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా ట్రెండ్ అనేది విపరీత హింసను కోరుకుంటుందా అనేది కాస్త విశ్లేషించుకోవాలి. కరోనా తర్వాత ఓటిటిల పుణ్యమా అంటూ ఓవర్ వయొలెన్స్ ఉన్న కంటెంట్ రాజ్యమేలుతున్న మాట వాస్తవం. స్క్విడ్ గేమ్ లాంటి సిరీస్ లు, సైకో కిల్లింగ్ సినిమాలు దీన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి.
అలాని థియేటర్ ఎక్స్ పీరియన్స్ కేవలం ఈ రక్తపాతాన్ని కోరుకుంటుందని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే యానిమల్, దురంధర్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ లోనూ హింస ఉన్నా బలమైన కథా కథనాలు, యాక్షన్, ఎమోషన్ వాటి విజయంలో కీలక పాత్ర పోషించాయి.
వెబ్ సిరీస్ లో భావోద్వేగాలు లేకపోయినా చల్తా. ఎందుకంటే ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి. కానీ సినిమాకు ఈ ట్రీట్ మెంట్ పనికిరాదు. కట్టిపడేసే సాలిడ్ స్క్రీన్ ప్లే పడాలి. అప్పుడే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. అంతే తప్ప నరకడాలు, జుగుప్సాకరంగా హత్యలు చేయడాలు చూపించినంత మాత్రాన పొలోమని టికెట్లు కొనరు.
ఇంకా ఇది ప్రారంభమే కాబట్టి కల్ట్ గురించి ఒక అభిప్రాయానికి రాలేం కానీ విశ్వక్ ఒకవేళ హింసతో మెప్పిస్తాను ఇంకేం అక్కర్లేదనునకుంటే పొరపాటే అవుతుంది. నాని హిట్ 3 కూడా పెద్ద స్థాయికి వెళ్లలేకపోవడానికి కారణం ఇదే. గేమ్స్ ఆడే వాళ్ళ ప్రాణాలు తీయడమనే పాయింట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం విశ్వక్ కు సవాల్ అవుతుంది.
అసలే వరస డిజాస్టర్లు తన మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేశాయి. ఎంత సమర్ధించుకున్నా ఫంకీని ఎవరూ హిట్ అనరు. బాగుందని సర్టిఫికెట్ ఇవ్వరు. కాబట్టి ఇకపై వీలైనంత ప్రాక్టికల్ యాంగిల్ లోకి విశ్వక్ వచ్చేయడం బెటర్. ముఖ్యంగా కల్ట్ తనకు పెద్ద ఛాలెంజ్.
This post was last modified on February 22, 2026 4:15 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…