మహేష్ బాబు మహర్షిలో చేసిన పాత్ర అల్లరి నరేష్ కథల ఎంపికలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది. నాంది విజయం దానికి మరింత ఊతమిచ్చింది. తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ మంచి ప్రయత్నమనే పేరు వచ్చింది. ఇప్పుడు తిరిగి నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపి ఉగ్రంతో వస్తున్నాడు. మే 5న విడుదల కాబోతున్న ఈ సినిమాలో నరేష్ చాలా వయొలెంట్ గా ఫెరోషియస్ గా నటించాడు. ట్రైలర్ చూశాక గతంలో ఎన్నడూ చూడని తీవ్రత కళ్ళలోనే కాదు యాక్టింగ్ లోనూ కనిపిస్తోంది
ఏదీ దాచకుండా స్టోరీ మొత్తం ఓపెన్ గా చెప్పేశారు. నగరంలో వరస కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఎక్కువగా మహిళలు చిన్న పిల్లల జాడ తెలియక వేలు లక్షల్లో తల్లితండ్రులు తల్లడిల్లిపోతుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసే శివకుమార్(అల్లరి నరేష్) ఆ ముఠాల బారిన పడి భార్యా బిడ్డను పోగొట్టుకుంటాడు. వాళ్ళను అన్వేషించే క్రమంలో ఇదంతా ఒకరిద్దరు చేస్తున్నది కాదని పెద్ద తలకాయలు ఉన్నాయని గుర్తిస్తాడు. ఇతన్ని అడ్డుకుకే ప్లాన్ లో భాగంగా మాఫియా వేసిన స్కెచ్ లో ఓ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఛాలెంజ్ చేసి మరీ వాళ్ళ ఆట కట్టించేందుకు సిద్ధపడతాడు.
చాలా హై ఇంటెన్సిటి డ్రామాగా విజయ్ ఉగ్రంని తీర్చిదిద్దాడు. గతంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చినప్పటికీ డెప్త్ విషయంలో నరేష్ మూవీ డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఇంత ఓపెన్ గా వివరించారంటే ఈ వీడియోలో లేని చాలా ట్విస్టులు తెరమీద సర్ప్రైజ్ చేయబోతున్నాయన్న మాట. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చిన ఉగ్రంకు శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. మే 5 గోపీచంద్ రామబాణంతో పాటుగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. చూస్తుంటే అల్లరి నరేష్ దగ్గర్లో కామెడీ జానర్ జోలికి వెళ్లేలా లేడు. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే కంటెంట్ నే ఎంచుకుంటున్నాడు
This post was last modified on April 22, 2023 11:18 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…