ఒక హిట్టు వస్తే చాలు వెంటనే రెండు మూడు ఫ్లాపులు వరసగా పలకరించేలా సాగుతోంది రవితేజ కెరీర్. నటుడిగా ఇప్పుడు కొత్తగా ఋజువు చేసుకోవాల్సింది ఏమీ లేకపోయినా పదే పదే ఒకరకమైన కథలతో తన దగ్గరకు దర్శకులు వస్తున్న విషయాన్ని గుర్తించిన మాస్ మహారాజా ఇకపై రూటు మార్చాలని నిర్ణయిచుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా వాల్తేరు వీరయ్య లాగా కథ బాగుంటే నిడివి ఎంత ఉంది ఇంకెవరెవరికి ప్రాధాన్యత ఇచ్చారు లాంటివి పట్టించుకోకుండా ఓకే చేస్తారట. టైగర్ నాగేశ్వరరావు అందులో భాగంగా ఎంచుకున్నదేనని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉండగా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ఇటీవలే రవితేజకు ఒక లైన్ చెప్పి మెప్పించారట. మధ్యవయసులో ఉండే ఒక కాలేజీ లెక్చరర్ పాత్రను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు వినికిడి. ఇందులో స్టూడెంట్ గా మరో యూత్ హీరో అవసరం పడటంతో శర్వానంద్, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డలలో ఒకరిని మెప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోలు సంతకాలు చేస్తే తప్ప అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాదు.
చూస్తుంటే రవితేజ పూర్తిగా స్టైల్ మార్చేసి ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని అర్థమవుతోంది. రావణాసుర దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ సుధీర్ వర్మ చెప్పిన లైన్ నచ్చడం వల్లే స్వయంగా నిర్మాతగా మారి మరీ పది కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వచ్చింది. అయినా సరే ఇప్పటికిప్పుడు పంథాని మార్చుకోకుండా ఇకపై కూడా కొనసాగిస్తారట. మరోవైపు చిన్న సినిమాల ప్రొడక్షన్ ని మొదలుపెట్టిన రవితేజ ఇటీవలే చాంగురే బంగారురాజాని పూర్తి చేయించారు. తాను హీరోగా నటించకపోయినా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం లక్ష్యంగా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు
This post was last modified on April 24, 2023 10:11 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…