ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో పుష్ప-2 ఒకటి. ఏడాదిన్నర కిందట వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. రిలీజ్ తర్వాత హైప్ అంతకంతకూ పెరిగిపోయి.. పుష్ప-2 మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతున్నట్లు సమాచారం.
కథాకథనాలతో పాటు ప్రతి విషయంలోనూ పుష్ప కంటే మెరుగ్గా పుష్ప-2 ఉంటుందన్న ధీమా చిత్ర బృందంలో వ్యక్తమవుతోంది. ఈ మధ్యే రిలీజైన పుష్ప-2 టీజర్ సైతం ఆకట్టుకుంది. ఈసారి పుష్ప అస్సలు తగ్గదేలే అనబోతున్నాడని అర్థమైంది. ఇక సినిమాలో బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ఎవరి స్థాయిలో వాళ్లు కష్టపడుతుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సైతం తన ముద్ర వేయడానికి చూస్తున్నాడట.
పుష్ప-2 స్క్రిప్టు వర్క్ జరుగుతున్నపుడే ఈ సినిమా సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి. సుకుమార్ ఏదీ ఒక పట్టాన ఒప్పుకునే రకం కాదు. సినిమా కోసం పదుల సంఖ్యలో ట్యూన్లు ఇస్తే.. అందులో కొన్ని ఫైనలైజ్ చేశాడట సుక్కు. వాటిలో రెండు పాట రికార్డింగ్ పూర్తయినట్లు సమాచారం. అవి రెండూ అదిరిపోతాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా పుష్ప-1లో బ్లాక్బస్టర్ అయిన ఏ బిడ్డా సాంగ్ తరహాలోనే ఇందులోనూ హీరో ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుందట. అది కూడా హీరో పాత్ర చిత్రణతో ముడిపడ్డ పాటేనట. కాస్త ఏయ్ బిడ్డాకు అనుకరణలా అనిపించినప్పటికీ.. ఈ పాట కూడా అదిరిపోతుందని.. ఇది కూడా చార్ట్ బస్టర్ అవడం ఖాయమని ఆ పాట విన్నవాళ్లు అంటున్నారు. జనాలు హమ్ చేసుకునేలా సింపుల్ పదాలతో చంద్రబోస్ సాహిత్యం అందిస్తే.. దేవిశ్రీ మంచి ఊపునిచ్చే మ్యూజిక్ ఇచ్చాడని.. ఈ పాట రిలీజైనపుడు సంచలనం రేపడం ఖాయమని సమాచారం.
This post was last modified on April 21, 2023 2:28 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…