రెండేళ్ల కిందట సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదం టాలీవుడ్ను పెద్ద షాక్కే గురి చేసింది. ముందు అది చిన్న ప్రమాదంలాగే కనిపించినా.. తర్వాత తర్వాత దాని తీవ్రత అర్థమైంది. ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు ఉన్న తేజు.. పూర్తిగా కోలుకుని బయటికి రావడానికి ఏడాది దాకా సమయం పట్టింది. అతను కోలుకున్నాక చేసిన సినిమానే.. విరూపాక్ష. ఈ రోజే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే రాబట్టేలా కనిపిస్తోంది.
ఐతే సినిమాలో అన్నీ బాగున్నా.. హీరో సాయిధరమ్ తేజ్ లుక్, తన స్క్రీన్ ప్రెజెన్సే కొంచెం తేడాగా అనిపించాయి. అలాగని తేజు బేసిగ్గానే అంత అనుకోవడానికి వీల్లేదు. గతంలో అతను చేసిన సినిమాల్లో చాలా ఉత్సాహంగా కనిపించేవాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుండేది. ఈ సినిమాలో మాత్రం తేజు చాలా డల్లుగా కనిపించాడు. అతడి కదలికలు కూడా నెమ్మదిగా అనిపించాయి.
కొన్ని సన్నివేశాల్లో ఓకే అనిపించినా.. కొన్ని సీన్లలో మాత్రం తేజు నీరసంగా అనిపించాడు. దీన్ని బట్టి చూస్తే అతను పూర్తిగా కోలుకోవడానికి ముందే ఈ చిత్రంలో నటించినట్లున్నాడు. యాక్సిడెంట్ తాలూకు ప్రభావం శారీరకంగానే కాక మానసికంగా కూడా తేజు మీద పడిందేమో.. అందుకే అతణ్ని దాన్నుంచి బయటకు తీసుకురావడానికి సినిమానే మార్గంగా భావించి కుటుంబ సభ్యులు ఈ సినిమాను మొదలుపెట్టించి ఉండొచ్చేమో.
మొత్తానికి తేజును ఇలా డల్లుగా చూడటం మెగా అభిమానులకు కొంచెం ఇబ్బందిగానే అనిపించినా.. ఓవరాల్గా సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటం.. మంచి టాక్ రావడం సంతోషమే. తేజుకు యాక్సిడెంట్ అయిన సమయంలోనే రిలీజైన రిపబ్లిక్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు విరూపాక్షతో తేజు బౌన్స్ బ్యాక్ అయినట్లే.
This post was last modified on April 21, 2023 2:16 pm
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…