మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలకు కలిపి నాలుగేళ్ల దాకా టైం తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఉన్నట్లుండి స్పీడు పెంచేశారు. చకచకా ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నాలుగు నెలల వ్యవధిలో అవి రిలీజయ్యేలా చూశారు. ఆ తర్వాత ‘భోళా శంకర్’ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఐతే ‘భోళా శంకర్’ తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సందిగ్ధత నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే.. వెంకీ కుడుముల సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక దాన్ని హోల్డ్లో పెట్టారు. ఈలోపు వెంకీ.. నితిన్ సినిమాను మొదలుపెట్టేశాడు. చిరు సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఇంకో రెండు నెలల్లో ‘భోళా శంకర్’కు సంబంధించి చిరు పనంతా అయిపోతుంది. ఆలోపు చిరుకు కొత్త ప్రాజెక్టు ఓకే కావాల్సి ఉంది.
చిరు ప్రస్తుతం ఏదో ఒక ఆప్షన్ అని కాకుండా చాలానే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో ప్రధానంగా నలుగురు రచయితలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా వరుసగా హిట్లు కొట్టిన ప్రసన్న కుమార్ బెజవాడ చిరు కోసం రెండు మూడు కథలు వండుతున్నట్లు సమాచారం. వాటిలో చిరు ఏది ఓకే అంటే దాన్ని ఆయనకు ఇచ్చేస్తాడట. చిరుకు గురి ఉన్న దర్శకుడికి ఆ కథను ఇచ్చి డైరెక్ట్ చేయమంటారు.
మరోవైపు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి సైతం చిరు కోసం ఒక కథ వండుతున్నట్లు సమాచారం. తాజాగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు నాగార్జున రెఫరెన్సుతో చిరును కలిసి కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ కూడా చిరు కోసం కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇంకోవైపు చిరు ఇంతకుముందు ఇచ్చిన హామీ మేరకు పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ సైతం కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. పూరి సొంతంగా ప్రయత్నిస్తుంటే.. వినాయక్ రైటర్ల మీద ఆధారపడుతున్నారు. మరి ఈ అరడజను మందిలో ఎవరు తమ కథతో చిరును మెప్పిస్తారో చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…