మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలకు కలిపి నాలుగేళ్ల దాకా టైం తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఉన్నట్లుండి స్పీడు పెంచేశారు. చకచకా ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను నాలుగు నెలల వ్యవధిలో అవి రిలీజయ్యేలా చూశారు. ఆ తర్వాత ‘భోళా శంకర్’ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఐతే ‘భోళా శంకర్’ తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సందిగ్ధత నెలకొంది. ముందు అనుకున్న ప్రకారం అయితే.. వెంకీ కుడుముల సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక దాన్ని హోల్డ్లో పెట్టారు. ఈలోపు వెంకీ.. నితిన్ సినిమాను మొదలుపెట్టేశాడు. చిరు సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఇంకో రెండు నెలల్లో ‘భోళా శంకర్’కు సంబంధించి చిరు పనంతా అయిపోతుంది. ఆలోపు చిరుకు కొత్త ప్రాజెక్టు ఓకే కావాల్సి ఉంది.
చిరు ప్రస్తుతం ఏదో ఒక ఆప్షన్ అని కాకుండా చాలానే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో ప్రధానంగా నలుగురు రచయితలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా.. ఇలా వరుసగా హిట్లు కొట్టిన ప్రసన్న కుమార్ బెజవాడ చిరు కోసం రెండు మూడు కథలు వండుతున్నట్లు సమాచారం. వాటిలో చిరు ఏది ఓకే అంటే దాన్ని ఆయనకు ఇచ్చేస్తాడట. చిరుకు గురి ఉన్న దర్శకుడికి ఆ కథను ఇచ్చి డైరెక్ట్ చేయమంటారు.
మరోవైపు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి సైతం చిరు కోసం ఒక కథ వండుతున్నట్లు సమాచారం. తాజాగా ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు నాగార్జున రెఫరెన్సుతో చిరును కలిసి కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వేణు అలియాస్ వశిష్ఠ కూడా చిరు కోసం కొంచెం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇంకోవైపు చిరు ఇంతకుముందు ఇచ్చిన హామీ మేరకు పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ సైతం కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. పూరి సొంతంగా ప్రయత్నిస్తుంటే.. వినాయక్ రైటర్ల మీద ఆధారపడుతున్నారు. మరి ఈ అరడజను మందిలో ఎవరు తమ కథతో చిరును మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on April 20, 2023 7:27 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…