ఒక టీవీ ప్రోగ్రాంకు బాగా పాపులారిటీ వచ్చిన తర్వాత హఠాత్తుగా అది ఆగిపోవాల్సి వస్తే ఆ లోటుని పూడ్చడం అంత సులభంగా ఉండదు. ఎస్పి బాలు పోయాక పాడుతా తీయగాకు మునుపటి కళను తీసుకురావడానికి చరణ్ తో సహా టీమ్ మొత్తం కష్టపడినా ఫలితం రావడం లేదు. నాగబాబు, రోజా, హైపర్ ఆదిలు వేర్వేరు కారణాలతో జబర్దస్త్ ని వదిలాక ఆ కామెడీ షోకి ఆదరణ తగ్గిన మాట వాస్తవం. ఇదే ఈటీవీలో ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ ఛానల్ లో అన్ని ఎపిసోడ్లకు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.
రాజకీయంతో పాటు వేరే రీజన్ల వల్ల ఆలీ గుడ్ బై చెప్పాక దాన్ని రీప్లేస్ చేయడం ఈటీవీ సవాల్ గా మారింది. బాగా ఆలోచించి తెలివిగా వెన్నెల కిషోర్ ని లైన్ లోకి పెట్టి అలా మొదలైంది పేరుతో సెలబ్రిటీ జంటల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు ఎలా అయ్యాయనే దాని మీద ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. దీనికి గాను సినిమాలతోనే విపరీతమైన బిజీగా ఉన్న వెన్నెల కిషోర్ కు భారీ పారితోషికం ఇచ్చారని టీవీ వర్గాల టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కాబట్టి ఖర్చు విషయంలో రాజీ ఉండదు. ఇంత చేసినందుకు దానికి తగ్గ ఫలితమే దక్కినట్టు కనిపిస్తోంది
ఇందులో భాగంగా హీరో నిఖిల్, దర్శకుడు వంశీ పైడిపల్లి, డాక్టర్ రాజశేఖర్, మంచు మనోజ్ దంపతులతో జరిపిన ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందట. యాంకర్ గా అవతారమెత్తిన వెన్నెల కిషోర్ కు స్పందన బాగుందని తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ వచ్చిన భాగాన్ని అత్యధిక శాతం చూశారని సమాచారం. పోటీ వాతావరణంలో ఇలా ఏదో ఒకటి వినూత్నంగా చేయకపోతే జనాలు టీవీ ఛానల్స్ చూడటం లేదు. ఓటిటిలు వచ్చాక కేవలం సినిమాల మీదే ఆధారపడితే శాటిలైట్ ఛానల్స్ కు వర్కౌట్ కావడం లేదు. అందుకే ఇలా క్రియేటివిటీకి పదును పెడుతున్నారు.
This post was last modified on April 19, 2023 6:03 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…