కొత్త ఏడాదిలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హవా గురించి ఈ మధ్య టాలీవుడ్లో అందరూ మాట్లాడుకున్నారు. సంక్రాంతికి తన సంస్థ నుంచి రిలీజ్ చేసిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’తో ఆయన మంచి లాభాలే అందుకున్నారు. ఆ తర్వాత ‘బలగం’ పెట్టుబడి మీద ఎన్నో రెట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. అలాగే రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ సహా చాలా సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి.
2023 రాజుకు లక్కీ ఇయర్ లాగా మారిందనే చర్చ నడిచింది. ఐతే ఈ చర్చ వల్ల దిష్టి తగిలేసిందో ఏమో.. తన కొత్త సినిమాతో రాజు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లని మేకర్స్ చెప్పుకున్నారు. అంత అయ్యే ఛాన్స్ లేదని.. కానీ 50 కోట్లకు అయితే తక్కువ ఖర్చు అయి ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇందులో రాజు వాటా ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన ఈ సినిమా వల్ల కొన్ని కోట్లు నష్టపోయారన్నది స్పష్టం. నిజానికి ఇది దిల్ రాజు సొంతంగా ఓకే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. మధ్యలో ఈ ప్రాజెక్టులోకి దూరారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసి మంచి ఫలితాన్నందుకున్నాడు గుణశేఖర్. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. ఆ సినిమాతో గుణశేఖర్ చేసిన మ్యాజిక్ చూసి ఇంప్రెస్ అయి.. ‘శాకుంతలం’ అనౌన్స్ చేసి సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికి ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యాడు రాజు.
కథతో పాటు ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ చేసుకున్న ప్లానింగ్ నచ్చి ఇందులో తానెందుకు భాగం కాకూడదు అనుకున్నట్లు రాజు గతంలో తెలిపాడు. అలా గుణశేఖర్ అడక్కపోయినా.. కోరి ఈ సినిమాలోకి వచ్చాడు రాజు. జడ్జిమెంట్ కింగ్గా పేరున్న రాజు.. ఈ సినిమా విషయంలో తప్పటడుగు వేశాడన్నది స్పష్టం. అందుకు ఫలితంగా నష్టాలు భరించక తప్పట్లేదు.
This post was last modified on April 19, 2023 2:26 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…