కొత్త ఏడాదిలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హవా గురించి ఈ మధ్య టాలీవుడ్లో అందరూ మాట్లాడుకున్నారు. సంక్రాంతికి తన సంస్థ నుంచి రిలీజ్ చేసిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’తో ఆయన మంచి లాభాలే అందుకున్నారు. ఆ తర్వాత ‘బలగం’ పెట్టుబడి మీద ఎన్నో రెట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. అలాగే రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ సహా చాలా సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి.
2023 రాజుకు లక్కీ ఇయర్ లాగా మారిందనే చర్చ నడిచింది. ఐతే ఈ చర్చ వల్ల దిష్టి తగిలేసిందో ఏమో.. తన కొత్త సినిమాతో రాజు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లని మేకర్స్ చెప్పుకున్నారు. అంత అయ్యే ఛాన్స్ లేదని.. కానీ 50 కోట్లకు అయితే తక్కువ ఖర్చు అయి ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇందులో రాజు వాటా ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన ఈ సినిమా వల్ల కొన్ని కోట్లు నష్టపోయారన్నది స్పష్టం. నిజానికి ఇది దిల్ రాజు సొంతంగా ఓకే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. మధ్యలో ఈ ప్రాజెక్టులోకి దూరారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసి మంచి ఫలితాన్నందుకున్నాడు గుణశేఖర్. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. ఆ సినిమాతో గుణశేఖర్ చేసిన మ్యాజిక్ చూసి ఇంప్రెస్ అయి.. ‘శాకుంతలం’ అనౌన్స్ చేసి సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికి ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యాడు రాజు.
కథతో పాటు ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ చేసుకున్న ప్లానింగ్ నచ్చి ఇందులో తానెందుకు భాగం కాకూడదు అనుకున్నట్లు రాజు గతంలో తెలిపాడు. అలా గుణశేఖర్ అడక్కపోయినా.. కోరి ఈ సినిమాలోకి వచ్చాడు రాజు. జడ్జిమెంట్ కింగ్గా పేరున్న రాజు.. ఈ సినిమా విషయంలో తప్పటడుగు వేశాడన్నది స్పష్టం. అందుకు ఫలితంగా నష్టాలు భరించక తప్పట్లేదు.
This post was last modified on April 19, 2023 2:26 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…