కొత్త ఏడాదిలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హవా గురించి ఈ మధ్య టాలీవుడ్లో అందరూ మాట్లాడుకున్నారు. సంక్రాంతికి తన సంస్థ నుంచి రిలీజ్ చేసిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’తో ఆయన మంచి లాభాలే అందుకున్నారు. ఆ తర్వాత ‘బలగం’ పెట్టుబడి మీద ఎన్నో రెట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. అలాగే రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ సహా చాలా సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి.
2023 రాజుకు లక్కీ ఇయర్ లాగా మారిందనే చర్చ నడిచింది. ఐతే ఈ చర్చ వల్ల దిష్టి తగిలేసిందో ఏమో.. తన కొత్త సినిమాతో రాజు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లని మేకర్స్ చెప్పుకున్నారు. అంత అయ్యే ఛాన్స్ లేదని.. కానీ 50 కోట్లకు అయితే తక్కువ ఖర్చు అయి ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇందులో రాజు వాటా ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన ఈ సినిమా వల్ల కొన్ని కోట్లు నష్టపోయారన్నది స్పష్టం. నిజానికి ఇది దిల్ రాజు సొంతంగా ఓకే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. మధ్యలో ఈ ప్రాజెక్టులోకి దూరారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసి మంచి ఫలితాన్నందుకున్నాడు గుణశేఖర్. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. ఆ సినిమాతో గుణశేఖర్ చేసిన మ్యాజిక్ చూసి ఇంప్రెస్ అయి.. ‘శాకుంతలం’ అనౌన్స్ చేసి సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికి ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యాడు రాజు.
కథతో పాటు ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ చేసుకున్న ప్లానింగ్ నచ్చి ఇందులో తానెందుకు భాగం కాకూడదు అనుకున్నట్లు రాజు గతంలో తెలిపాడు. అలా గుణశేఖర్ అడక్కపోయినా.. కోరి ఈ సినిమాలోకి వచ్చాడు రాజు. జడ్జిమెంట్ కింగ్గా పేరున్న రాజు.. ఈ సినిమా విషయంలో తప్పటడుగు వేశాడన్నది స్పష్టం. అందుకు ఫలితంగా నష్టాలు భరించక తప్పట్లేదు.
This post was last modified on April 19, 2023 2:26 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…