కొత్త ఏడాదిలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హవా గురించి ఈ మధ్య టాలీవుడ్లో అందరూ మాట్లాడుకున్నారు. సంక్రాంతికి తన సంస్థ నుంచి రిలీజ్ చేసిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’తో ఆయన మంచి లాభాలే అందుకున్నారు. ఆ తర్వాత ‘బలగం’ పెట్టుబడి మీద ఎన్నో రెట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. అలాగే రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ సహా చాలా సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి.
2023 రాజుకు లక్కీ ఇయర్ లాగా మారిందనే చర్చ నడిచింది. ఐతే ఈ చర్చ వల్ల దిష్టి తగిలేసిందో ఏమో.. తన కొత్త సినిమాతో రాజు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లని మేకర్స్ చెప్పుకున్నారు. అంత అయ్యే ఛాన్స్ లేదని.. కానీ 50 కోట్లకు అయితే తక్కువ ఖర్చు అయి ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇందులో రాజు వాటా ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన ఈ సినిమా వల్ల కొన్ని కోట్లు నష్టపోయారన్నది స్పష్టం. నిజానికి ఇది దిల్ రాజు సొంతంగా ఓకే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. మధ్యలో ఈ ప్రాజెక్టులోకి దూరారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసి మంచి ఫలితాన్నందుకున్నాడు గుణశేఖర్. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. ఆ సినిమాతో గుణశేఖర్ చేసిన మ్యాజిక్ చూసి ఇంప్రెస్ అయి.. ‘శాకుంతలం’ అనౌన్స్ చేసి సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికి ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యాడు రాజు.
కథతో పాటు ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ చేసుకున్న ప్లానింగ్ నచ్చి ఇందులో తానెందుకు భాగం కాకూడదు అనుకున్నట్లు రాజు గతంలో తెలిపాడు. అలా గుణశేఖర్ అడక్కపోయినా.. కోరి ఈ సినిమాలోకి వచ్చాడు రాజు. జడ్జిమెంట్ కింగ్గా పేరున్న రాజు.. ఈ సినిమా విషయంలో తప్పటడుగు వేశాడన్నది స్పష్టం. అందుకు ఫలితంగా నష్టాలు భరించక తప్పట్లేదు.
This post was last modified on April 19, 2023 2:26 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…