ఇంకో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఆది పురుష్ ఇండియా కంటే మూడు రోజుల ముందు న్యూ యార్క్ లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో అధికారికంగా ప్రీమియర్ చేయబోతున్నట్టు టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. సో రిలీజ్ డేట్ విషయంలో ఇంకే అనుమానాలు అక్కర్లేదని స్పష్టంగా క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. షో వేస్తోంది యుఎస్ లోనే కాబట్టి అక్కడి ఆడియన్స్, క్రిటిక్స్ చూసే అవకాశం దక్కుతుంది. ప్లస్సులు మైనస్సులు అన్నీ బయటికి వచ్చేస్తాయి. మన దేశంలోలా థియేటర్ వీడియోలు రాకపోయినా అభిప్రాయాల రూపంలో రివ్యూలు ప్రత్యక్షమవుతాయి.
అయినా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆది పురుష్ టీమ్ చిత్రోత్సవంలో ప్రదర్శనకు పచ్చ జెండా ఊపింది. అయితే టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక భారీ ఖర్చుతో మళ్ళీ రిపేర్లు చేయించారని, విఎఫ్ఎక్స్ మొత్తం ఫ్రెష్ గా ఉంటుందని వచ్చిన వార్తల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని ముంబై టాక్. కేవలం కలర్ కరెక్షన్ కు సంబంధించి మాత్రమే కొన్ని మార్పులు చేశారు తప్పించి మిగిలినదంతా అదేనని సమాచారం. ట్రిబెకా నిర్వాహకులకు సమర్పించనున్న ప్రింట్ లో ఈ విషయం స్పష్టంగా బయట పడిందని ఆల్రెడీ సొషల్ మీడియా కోడై కూస్తోంది.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందిన ఆది పురుష్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ గానే ఉన్నారు. కంటెంట్ ఏ మాత్రం అటుఇటుగా ఉన్నా ప్రేక్షకులు ఎంత నిర్మొహమాటంగా తిరస్కరిస్తారో శాకుంతలంతో మరోసారి అర్థమయ్యింది కాబట్టి రామాయణ గాధని దర్శకుడు ఓం రౌత్ ఎలా హ్యాండిల్ చేశాడోనని ఎదురు చూస్తున్నారు. దీని సంగతలా ఉంచితే ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఒకటి రెండు రోజుల ముందు ఇక్కడా స్పెషల్ షోలు ప్లాన్ చేసినట్టు వినికిడి. ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలను ఈ స్క్రీనింగ్స్ కి ఆహ్వానిస్తారని టాక్.
This post was last modified on April 19, 2023 12:28 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…