ఎంత రొటీన్ సినిమా తీసినా సరే వంద కోట్ల వసూళ్లు మంచినీళ్ల ప్రాయంగా సాధిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు మన తెలుగు దర్శకుల మీద గట్టి గురి కుదురుతోంది. వారసుడు తెలుగు వెర్షన్ ఫలితం ఎలా ఉన్నా దాన్ని వంశీపైడిపల్లి హ్యాండిల్ చేసిన తీరు విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ఇంకో కథను సిద్ధం చేసుకోమని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫైనల్ వెర్షన్ లాకయ్యాక ఆ లాంఛనం కూడా అయిపోతుంది. ప్రస్తుతం విజయ్ సన్ పిక్చర్స్ కోసం లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న లియా ఆగస్ట్ నెలాఖరులో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
ఇది జరుగుతున్న క్రమంలోనే మరో టాలీవుడ్ డైరెక్టర్ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెన్నై టాక్. గోపిచంద్ మలినేని చెప్పిన ఒక లైన్ నచ్చడంతో సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. క్రాక్, వీరసింహారెడ్డిలతోపాటు గతంలో తీసిన సినిమాలు విజయ్ కు నచ్చడం వల్లే ఇది పట్టాలెక్కే ఛాన్స్ పెరిగిందని అంటున్నారు. మధ్యవర్తిగా దిల్ రాజు వ్యవహరించి ఈ సిట్టింగ్ చేయించారట. ఇప్పటిదాకా కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన మలినేని ఇప్పుడు మార్కెట్ పెంచుకునే దిశగా చూస్తున్నాడు. మన హీరోలందరూ బిజీగా ఉండటంతో ఇలా విజయ్ ని లైన్ లో తీసుకున్నాడు.
ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే బాలయ్య స్థాయి హీరోని డీల్ చేశాక గోపిచంద్ మలినేని లాంటి వాళ్ళు మీడియం రేంజ్ లో సర్దుకోలేరు. మరోవైపు ఇంకో ఏడాది రెండేళ్ల పాటు ఎవరి కాల్ షీట్లు ఖాళీగా లేవు. దాని కోసం టైం వేస్ట్ చేసుకోవడం కన్నా విజయ్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంటే ఈజీగా రెండు వందల కోట్ల బొమ్మ ఖాతాలో పడిపోతుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ట్రిపుల్ సెంచరీ కొట్టొచ్చు. ఖచ్చితంగా అయిదారు నెలల్లోనే సినిమా మొత్తం పూర్తయ్యేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న విజయ్ కి తెలివిగా ఆప్షన్లు ఎంచుకుంటున్నాడు.
This post was last modified on April 18, 2023 11:07 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…