పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండటం పట్ల అభిమానుల్లో వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రీమేకే. దాని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సైతం రీమేకే. ఇప్పుడు పవన్ నుంచి రిలీజ్ కానున్న కొత్త చిత్రం కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన వినోదియ సిత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఒరిజినల్ తీసిన సముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం జులైలో విడుదల కాబోతోంది.
ఐతే ఈ సినిమా పేరుకే రీమేక్ అని.. మాతృకతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుందని.. రీమేక్ లాగా అనిపించదని అంటున్నాడు సాయిధరమ్ తేజ్. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి తాను చేస్తున్న సినిమాకు.. దాని మాతృకకు అసలు సంబంధం ఉండదని తేజు సింపుల్గా తేల్చేశాడు. మాతృకలోని సోల్ మాత్రమే తీసుకుని.. మిగతా సినిమా అంతా మార్చేశారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చాలా జరిగాయని తేజు తెలిపాడు.
తన మావయ్యతో కలిసి నటిస్తున్న సినిమాకు రీమేక్ను ఎంచుకోవడంపై అభిమానులు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. కానీ రీమేకా ఇంకోటా అన్నది పక్కన పెడితే తనను చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేసిన వ్యక్తితో కలిసి నటించడం అన్నది తనకు గొప్ప అనుభవమని తేజు తెలిపాడు. మావయ్యతో నటించడం తన డ్రీమ్ కాబట్టి ఏ కథ, ఎలాంటి సినిమా అన్నది పట్టించుకోనని.. ఆ అవకాశం వస్తే ఎలా వదులుకుంటానని తేజు అన్నాడు. ఇక తన పెళ్లి గురించి వచ్చే రూమర్లపై తేజు స్పందిస్తూ.. వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో ఇలా విపరీతంగా ప్రచారం జరగడం వల్లే తన పెళ్లి జరగట్లేదని చమత్కరించాడు.
This post was last modified on April 18, 2023 8:31 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…