పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండటం పట్ల అభిమానుల్లో వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రీమేకే. దాని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సైతం రీమేకే. ఇప్పుడు పవన్ నుంచి రిలీజ్ కానున్న కొత్త చిత్రం కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన వినోదియ సిత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఒరిజినల్ తీసిన సముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం జులైలో విడుదల కాబోతోంది.
ఐతే ఈ సినిమా పేరుకే రీమేక్ అని.. మాతృకతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుందని.. రీమేక్ లాగా అనిపించదని అంటున్నాడు సాయిధరమ్ తేజ్. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి తాను చేస్తున్న సినిమాకు.. దాని మాతృకకు అసలు సంబంధం ఉండదని తేజు సింపుల్గా తేల్చేశాడు. మాతృకలోని సోల్ మాత్రమే తీసుకుని.. మిగతా సినిమా అంతా మార్చేశారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చాలా జరిగాయని తేజు తెలిపాడు.
తన మావయ్యతో కలిసి నటిస్తున్న సినిమాకు రీమేక్ను ఎంచుకోవడంపై అభిమానులు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. కానీ రీమేకా ఇంకోటా అన్నది పక్కన పెడితే తనను చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేసిన వ్యక్తితో కలిసి నటించడం అన్నది తనకు గొప్ప అనుభవమని తేజు తెలిపాడు. మావయ్యతో నటించడం తన డ్రీమ్ కాబట్టి ఏ కథ, ఎలాంటి సినిమా అన్నది పట్టించుకోనని.. ఆ అవకాశం వస్తే ఎలా వదులుకుంటానని తేజు అన్నాడు. ఇక తన పెళ్లి గురించి వచ్చే రూమర్లపై తేజు స్పందిస్తూ.. వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో ఇలా విపరీతంగా ప్రచారం జరగడం వల్లే తన పెళ్లి జరగట్లేదని చమత్కరించాడు.
This post was last modified on April 18, 2023 8:31 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…