పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండటం పట్ల అభిమానుల్లో వ్యతిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రీమేకే. దాని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సైతం రీమేకే. ఇప్పుడు పవన్ నుంచి రిలీజ్ కానున్న కొత్త చిత్రం కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన వినోదియ సిత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఒరిజినల్ తీసిన సముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం జులైలో విడుదల కాబోతోంది.
ఐతే ఈ సినిమా పేరుకే రీమేక్ అని.. మాతృకతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుందని.. రీమేక్ లాగా అనిపించదని అంటున్నాడు సాయిధరమ్ తేజ్. తన మావయ్య పవన్ కళ్యాణ్తో కలిసి తాను చేస్తున్న సినిమాకు.. దాని మాతృకకు అసలు సంబంధం ఉండదని తేజు సింపుల్గా తేల్చేశాడు. మాతృకలోని సోల్ మాత్రమే తీసుకుని.. మిగతా సినిమా అంతా మార్చేశారని.. అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చాలా జరిగాయని తేజు తెలిపాడు.
తన మావయ్యతో కలిసి నటిస్తున్న సినిమాకు రీమేక్ను ఎంచుకోవడంపై అభిమానులు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. కానీ రీమేకా ఇంకోటా అన్నది పక్కన పెడితే తనను చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేసిన వ్యక్తితో కలిసి నటించడం అన్నది తనకు గొప్ప అనుభవమని తేజు తెలిపాడు. మావయ్యతో నటించడం తన డ్రీమ్ కాబట్టి ఏ కథ, ఎలాంటి సినిమా అన్నది పట్టించుకోనని.. ఆ అవకాశం వస్తే ఎలా వదులుకుంటానని తేజు అన్నాడు. ఇక తన పెళ్లి గురించి వచ్చే రూమర్లపై తేజు స్పందిస్తూ.. వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో ఇలా విపరీతంగా ప్రచారం జరగడం వల్లే తన పెళ్లి జరగట్లేదని చమత్కరించాడు.
This post was last modified on April 18, 2023 8:31 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…