కింగ్ నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోతున్న సినిమా షూటింగ్ ఎంతకీ ప్రారంభం కాకపోవడం అభిమానుల అసహనానికి కారణమవుతోంది. మలయాళం హిట్ మూవీ పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందబోయే ఈ విలేజ్ డ్రామా స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమయ్యింది. అయితే హక్కుల విషయంలో నిర్మాతలిద్దరికీ వచ్చిన అభిప్రాయభేదాల వల్ల రెండు నెలలు బ్రేక్ పడింది. దీనికోసమే ప్రత్యేకంగా గెడ్డం పెంచి కొత్త లుక్ కి వచ్చిన నాగ్ అది తనకు పూర్తి సంతృప్తినివ్వకపోవడంతో మళ్ళీ క్లీన్ షేవ్ కు వచ్చేశారని ఇన్ సైడ్ టాక్.
ఇప్పుడింకో లుక్ మీద ప్రసన్న పనిచేస్తున్నట్టు సమాచారం. ఇది కాకుండా స్క్రిప్ట్ లో చేసిన మార్పులు కూడా మరోసారి చర్చలోకి వచ్చాయట. ఊరికే హడావిడి పడి 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న డెడ్ లైన్ తో ఇబ్బంది పడకుండా ఎంత ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్ గా అన్నీ కుదిరాకే సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని వినికిడి. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఈ ప్రాజెక్టే క్యాన్సిల్ అయ్యిందని నాగార్జున మరో ఆప్షన్ చూస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. మొత్తానికి ఈ టీమ్ లో ఉన్నవాళ్ళెవరూ డైరెక్ట్ గా మీడియాతో ఓపెనయ్యేందుకు ఇష్టపడటం లేదు.
గత కొన్నేళ్లుగా బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున ఈసారి తొందరపాటు ప్రదర్శించే ఉద్దేశంలో లేరు. అవసరమైతే ఇదే కథకు దర్శకుడిని మార్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. అదే జరిగితే మొదటి అడుగులోనే ప్రసన్నకు పెద్ద దెబ్బ పడినట్టు అవుతుంది. ఇది 99వ మూవీ. వందో సినిమా గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయాలని గతంలో డిసైడ్ అయ్యారు. కాకపోతే స్టోరీ విషయంలో దానికీ ఇబ్బంది ఉంది. మొత్తానికి ఈసారి ఫ్యాన్స్ కోరుకున్నంత వేగంగా నాగార్జున సినిమాలు రాకపోవచ్చు.
This post was last modified on April 17, 2023 10:00 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…