దుల్కర్ సల్మాన్ను పర భాషా నటుడిగా తెలుగు వాళ్లు ఎవ్వరూ ఫీలవ్వట్లేదు ఇప్పుడు. మణిరత్నం అనువాద చిత్రం ‘ఓకే బంగారం’తోనే అతను మన ప్రేక్షకుల మనసు దోచాడు. ఆ తర్వాత ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రతో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాలో రామ్ పాత్రలో అతడి అభినయం గురించి ఏం చెప్పాలి? మన హీరోలు కూడా ఎవరూ ఆ పాత్రకు సూట్ కారు, తనే పర్ఫెక్ట్ అని తెలుగు ప్రేక్షకులతో అనిపించే స్థాయిలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
నటనకు తోడు తెలుగు ఉచ్ఛారణ విషయంలోనూ దుల్కర్ మంచి మార్కులు వేయించుకున్నాడు. అసలు నెగెటివిటీ అన్నదే లేకుండా తన తన నటన చూస్తే ఎవ్వరైనా అభిమాని అయిపోవాల్సిందే అన్నట్లుగా పెర్ఫామ్ చేస్తాడు దుల్కర్. ‘సీతారామం’ చూశాక మరిందరు తెలుగు దర్శకులు అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఐతే మలయాళంలో ఫుల్ బిజీగా ఉన్న దుల్కర్.. ఇతర భాషల్లో ఆచితూచే సినిమాలు ఎంచుకుంటాడు. చాలా ప్రత్యేకంగా ఉన్న కథల్నే ఓకే చేస్తాడు. తాజాగా అతను మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనే.. వెంకీ అట్లూరి. ‘తొలి ప్రేమ’ తర్వాత తీసిన రెండు చిత్రాలతో నిరాశపరిచినప్పటికీ.. ‘సార్’ మూవీతో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు వెంకీ. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడు అతను దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ఒక బహు భాషా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడట.
రంగ్ దె, సార్ చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్లోనే తన తర్వాతి చిత్రం కూడా ఉంటుందని వెంకీ ఇప్పటికే ప్రకటించాడు. అన్నట్లే సితారకే ఈ సినిమా కూడా చేయనున్నాడట. ఇది పక్కా లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
This post was last modified on April 17, 2023 4:41 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…