తమ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న మేకర్స్ విడుదలకు ముందే ప్రిమియర్స్ వేయడం మామూలే. అది వాళ్ల కాన్ఫిడెన్స్ను తెలియజేస్తుంది. సినిమా బాగుంటే ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి సినిమాకు కలిసొస్తుంది. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే మాత్రం ప్రిమియర్ షోలు కొంప ముంచడం ఖాయం. ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న సినిమాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘శాకుంతలం’ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. ఈ చిత్రానికి రిలీజ్కు నాలుగు రోజుల ముందే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో స్పెషల్ త్రీడీ ప్రిమియర్ వేశారు. ఆ షోకు మీడియా వాళ్లను అనుమతించలేదు. వాళ్ల కోసం తర్వాతి రోజు వేరే షో వేయాలని అనుకున్నారు. ఐతే సినిమా మీద ధీమాగా ఉన్న మేకర్స్ ప్రిమియర్ షో నుంచి మంచి టాక్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది.
నిజంగా సినిమా జనాలకు నచ్చి ఉంటే ఆహా ఓహో అంటూ కొనియాడేవారు. సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్లు గట్టిగా పడేవి. వాటిని టీం కూడా ప్రమోట్ చేసేది. కానీ ‘శాకుంతలం’ షో తర్వాత జనాలు కామ్గా ఉండిపోయారు. బాగా కష్టపడి, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా కాబట్టి షో చూసిన జనాలు చాలా వరకు సైలెంటుగా ఉండిపోయారు. కానీ కొంతమంది మాత్రం సినిమాను ట్రోల్ చేశారు. మీమర్స్ కొందరు డ్యూటీ ఎక్కి ఇది సినిమా కాదు.. సీరియల్ అంటూ మీమ్స్ వేశారు. ఇది బయ్యర్ల దృష్టికి వెళ్లింది. దాని వల్ల నిర్మాతలు ఇరుకున పడ్డట్లు సమాచారం.
ముందు చేసుకున్న ఒప్పందాల మేర డబ్బులు కట్టడానికి బయ్యర్లు అంగీకరించలేదని.. దీంతో చివరి నిమిషాల్లో దర్శక నిర్మాత గుణశేఖర్ భారీ డెఫిషిట్తో సినిమాను రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని.. ఈ విషయంలో సహ నిర్మాత దిల్ రాజుకు ఆయనకు చెడిందని సమాచారం. ఇప్పుడు సినిమాకు షేర్ చాలా తక్కువ రావడంతో బయ్యర్లు చేసిన సగం చెల్లింపులు కూడా వెనక్కి రాని పరిస్థితి తలెత్తిందని.. వాళ్లను గుణశేఖర్ ఏమీ అడిగే పరిస్థితి లేదని.. మొత్తంగా ఆయనకు ఈ సినిమా భారీ నష్టాలే తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…