కోలీవుడ్ బాహుబలిగా అక్కడివాళ్లు చెప్పుకునే పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల ఇంకో పదకొండు రోజుల్లో ఉంది. నటీనటులు కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని అక్కడా ఇక్కడా తిరుగుతూ ప్రమోషన్లు చేసుకుంటున్నారు. తమిళనాడు కేరళ మీద వీళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది. తెలుగు వెర్షన్ ని మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్న దిల్ రాజు ఇప్పటిదాకా ఎలాంటి చొరవ చూపించలేదు. అసలే శాకుంతలం గాయం పచ్చిగా ఉండగా వెంటనే పీఎస్ 2 కోసం రంగంలోకి దిగేందుకు మనస్కరించలేదేమో.
పీఎస్ 1 ఏపీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. పది కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మితే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడానికి అష్టకష్టాలు పడింది. మన ఆడియన్స్ కాన్సెప్ట్ అర్థం కాక సోషల్ మీడియాలో పాజిటివ్ గా స్పందించలేకపోయారు. దీంతో సహజంగా ఆ ప్రభావం సీక్వెల్ మీద పడింది. హైప్ రాలేదు. ట్రేడ్ సైతం అనాసక్తిగా ఉంది. ఎలాగూ ఏజెంట్ అదే డేట్ కి వస్తుండటంతో ఫోకస్ దాని మీదే ఉంది. ఒకవేళ అఖిల్ కనక బ్లాక్ బస్టర్ కొడితే పీఎస్ 2 ఎదురీదటం కష్టమే. నిజానికి సెకండ్ పార్ట్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నా ప్రయోజనం కలగలేదు.
రిలీజ్ ఇంకో రెండు మూడు రోజులు ఉందనగా హైదరాబాద్ వచ్చి ఈవెంట్లు ఇంటర్వ్యూలు గట్రా చేస్తారు కానీ అప్పటికప్పుడు బజ్ రావడం కష్టం. ఏఆర్ రెహమాన్ పాటలు యూట్యూబ్ లో వచ్చినా ఒరిజినల్ వెర్షన్ అంత స్పందన ఇక్కడ లేదు. అసలు 28న విడుదలనే సంగతే మూవీ లవర్స్ కి తప్ప సాధారణ ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. ఈసారి బిజినెస్ లక్ష్యం పది కోట్లు పెట్టుకుంటారో లేక అంతకన్నా తక్కువకు రాజీ అవుతారో చూడాలి. మొదటిసారి ఒక సౌత్ సినిమా ఫోర్డి ఎక్స్ టెక్నాలజీ, ఐమాక్స్ రేషియోలో వస్తున్న ఘనత పీఎస్ 2కే దక్కనుంది.
This post was last modified on April 17, 2023 4:23 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…