ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల హవా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఏడాది చివర్లో సూర్యకుమార్ ప్రతాప్ 18 పేజెస్తో హిట్టు కొడితే.. ఈ ఏడాది దసరా మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. వీళ్లిద్దరూ సుక్కు శిష్యులే. ఇక వచ్చే శుక్రవారం విడుదల కానున్న విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న కార్తీక్ దండు సైతం సుక్కు మాజీ అసిస్టెంటే.
అతడి కథకు సుకుమారే స్వయంగా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చాడు ఈ సినిమాకు సంబంధించి తాజా ప్రమోషనల్ ఈవెంట్లో సుకుమార్.. తన శిష్యుడి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. అతను చావు దగ్గరికి వెళ్లి వెనక్కి వచ్చినట్లు తెలిపాడు. కార్తీక్ తనను తొలిసారి కలిసే సమయానికి తన జీవితం చాలా చిన్నదని ఆయన వ్యాఖ్యానించాడు. అప్పటికి ఐదారేళ్లకు మించి అతను బతికే ఛాన్స్ లేదని వైద్యులు చెప్పారన్నాడు. కార్తీక్కు ఒక ఆరోగ్య సమస్య ఉండేదని.. దాని వల్ల అతడి ప్లేట్లెట్స్ పడిపోయేవని.. అలాంటి స్థితి నుంచి అతను పోరాడి విరూపాక్ష లాంటి సినిమాను డైరెక్ట్ చేయడం చిన్న విషయం కాదని సుకుమార్ చెప్పాడు.
తనకు తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ తను చనిపోయేలోపు ఒక సినిమా డైరెక్ట్ చేసి వెళ్లిపోవాలని అతను అనుకున్నాడని.. ఐతే ఇందుకోసం చేసిన పోరాటంలో, తన తల్లి ప్రార్థనల వల్ల అదృష్టం కొద్దీ ఆ అనారోగ్య సమస్యను కార్తీక్ అధిగమించాడని సుకుమార్ తెలిపాడు. విరూపాక్ష సినిమాను అతను చాలా బాగా తీశాడని.. కథ చెప్పడం బాగా వచ్చిన వాడు దర్శకత్వం కూడా బాగా చేస్తాడని.. కార్తీక్కు ఆ నైపుణ్యం ఉందని ఆయన అన్నాడు. తాను ఈ సినిమాకు చేసింది పెద్దగా ఏమీ లేదని.. కార్తీక్ను పుష్ చేయడం మాత్రమే చేశానని సుకుమార్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on April 17, 2023 1:52 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…