హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అందరూ చేయలేరు. ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన అంచనాలు ఉన్నవాళ్లు, ఏ పాత్ర చేసినా స్వీకరించడానికి తగినంత మార్కెట్ సంపాదించుకున్న కథానాయికలు మాత్రమే మార్కెట్ ని శాశిస్తారు. శాకుంతలం డిజాస్టర్ ఫలితం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. కనీసం యావరేజ్ అయినా ఇంత ఫీలయ్యేవాళ్ళు కాదు కానీ రొట్ట మాస్ రుద్రుడికి పోటీ ఇవ్వలేనంత దారుణంగా రెండో రోజే పడిపోవడం ఊహించనిది. సమంతాను స్క్రీన్ పై శకుంతలగా జనం రిసీవ్ చేసుకోలేదు. పైగా అతకని స్వంత డబ్బింగ్ ఇంకాస్త డ్యామేజ్ చేసింది.
ఇక్కడే ఫ్యాన్స్ కి అనుష్క గుర్తొస్తోంది. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓపెనింగ్స్ రాబట్టిన వైనం గుర్తు చేసుకుంటున్నారు. అరుంధతితో టైటిల్ రోల్ పోషించినప్పుడు స్టార్ హీరో లేకుండా ఫామ్ తగ్గిపోయిన కోడి రామకృష్ణ ఏం హిట్ కొడతారులేనని అందరూ అనుమాన పడ్డారు. కట్ చేస్తే ఆ బ్లాక్ బస్టర్ ని ఇప్పటికీ మర్చిపోలేం. పంచాక్షరి లాంటి బ్యాడ్ మూవీకి సైతం ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం వేరే ఏముంటుంది. భాగమతి విజయం సాధించినా, నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించినా అదంతా స్వీటీ క్రెడిటేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు.
కొన్నేళ్లు బ్రేక్ తీసుకుంది కానీ ఒకవేళ ఇదే శాకుంతలంని ఇంకొంచెం పవర్ ఫుల్ గా తీర్చిదిద్ధి గుణశేఖర్ అనుష్కతో తీసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఈయనే తీసిన రుద్రమదేవికి ఫస్ట్ డేకి పది కోట్లకు పైగా వసూలు కావడం వెనుక మొదట పనిచేసింది ఈమె బ్రాండే. తర్వాత బన్నీ లాగేశాడు. త్వరలో రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నవీన్ పోలిశెట్టితో సమానంగా అనుష్కని పోస్టర్లలో మార్కెట్ చేస్తున్నారు. ఒకప్పుడు విజయశాంతి ఆ తర్వాత అనుష్క ఇలా కొందరు మాత్రమే ప్రత్యేక ముద్ర వేయగలిగారు. సామ్ ఎంత మంచి నటి అయినా సరే బరువైన పాత్రలకు రైట్ ఛాయస్ కాలేకపోయింది.
This post was last modified on April 16, 2023 11:25 am
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…