హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అందరూ చేయలేరు. ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన అంచనాలు ఉన్నవాళ్లు, ఏ పాత్ర చేసినా స్వీకరించడానికి తగినంత మార్కెట్ సంపాదించుకున్న కథానాయికలు మాత్రమే మార్కెట్ ని శాశిస్తారు. శాకుంతలం డిజాస్టర్ ఫలితం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. కనీసం యావరేజ్ అయినా ఇంత ఫీలయ్యేవాళ్ళు కాదు కానీ రొట్ట మాస్ రుద్రుడికి పోటీ ఇవ్వలేనంత దారుణంగా రెండో రోజే పడిపోవడం ఊహించనిది. సమంతాను స్క్రీన్ పై శకుంతలగా జనం రిసీవ్ చేసుకోలేదు. పైగా అతకని స్వంత డబ్బింగ్ ఇంకాస్త డ్యామేజ్ చేసింది.
ఇక్కడే ఫ్యాన్స్ కి అనుష్క గుర్తొస్తోంది. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఓపెనింగ్స్ రాబట్టిన వైనం గుర్తు చేసుకుంటున్నారు. అరుంధతితో టైటిల్ రోల్ పోషించినప్పుడు స్టార్ హీరో లేకుండా ఫామ్ తగ్గిపోయిన కోడి రామకృష్ణ ఏం హిట్ కొడతారులేనని అందరూ అనుమాన పడ్డారు. కట్ చేస్తే ఆ బ్లాక్ బస్టర్ ని ఇప్పటికీ మర్చిపోలేం. పంచాక్షరి లాంటి బ్యాడ్ మూవీకి సైతం ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం వేరే ఏముంటుంది. భాగమతి విజయం సాధించినా, నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించినా అదంతా స్వీటీ క్రెడిటేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు.
కొన్నేళ్లు బ్రేక్ తీసుకుంది కానీ ఒకవేళ ఇదే శాకుంతలంని ఇంకొంచెం పవర్ ఫుల్ గా తీర్చిదిద్ధి గుణశేఖర్ అనుష్కతో తీసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఈయనే తీసిన రుద్రమదేవికి ఫస్ట్ డేకి పది కోట్లకు పైగా వసూలు కావడం వెనుక మొదట పనిచేసింది ఈమె బ్రాండే. తర్వాత బన్నీ లాగేశాడు. త్వరలో రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నవీన్ పోలిశెట్టితో సమానంగా అనుష్కని పోస్టర్లలో మార్కెట్ చేస్తున్నారు. ఒకప్పుడు విజయశాంతి ఆ తర్వాత అనుష్క ఇలా కొందరు మాత్రమే ప్రత్యేక ముద్ర వేయగలిగారు. సామ్ ఎంత మంచి నటి అయినా సరే బరువైన పాత్రలకు రైట్ ఛాయస్ కాలేకపోయింది.
This post was last modified on April 16, 2023 11:25 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…