టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సురేందర్ రెడ్డి చివరగా సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం తీశాడు. ఆ సినిమాలో ఉన్నంతలో బాగానే ఆడినా.. బడ్జెట్ మరీ ఎక్కువ పెట్టేయడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. దర్శకుడిగా సురేందర్ అయితే తన వరక మంచి పనితనమే చూపించాడు. అయినా అతడి కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది.
అతను కోరుకున్న స్థాయి పెద్ద సినిమా చేయలేకపోయాడు తర్వాత. చివరికి అఖిల్తో ఏజెంట్ సినిమాను మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమా కూడా రకరకాల కారణల వల్ల ఆలస్యం అయింది. గత ఏడాది మధ్యలోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. చివరికి ఈ నెల 28కు రిలీజ్ డేట్ పిక్స్ చేసుకుంది. ఆ డేట్ అందుకోవడానికి కూడా టీం చాలా కష్టపడాల్సి వస్తోంది. మరి ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటని ఏజెంట్ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగితే సమాధానం చెప్పాడు సురేందర్.
ఏజెంట్ సినిమాకు వర్కింగ్ డేస్ 100 రోజులు మాత్రమే అని సురేందర్ వెల్లడించాడు. కరోనా వల్ల దాదాపు ఏడాది పాటు చిత్రీకరణ జరపలేకపోయామన్నాడు. ఇక తానేమో ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉండటం వల్ల కూడా సినిమా ఆలస్యం అయిందని సురేందర్ తెలిపాడు. ఐతే ఆరు నెలలు ఆసుపత్రిలో ఉన్నాడంటే సురేందర్కు ఏమైందా అన్న చర్చ మొదలైంది.
అతను కరోనా సోకి ఇబ్బంది పడ్డాడా.. అలా అయినా అంత కాలం ఆసుపత్రిలో ఉండటం ఏంటి.. ఇంకేదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తిందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇక ఏజెంట్ సినిమా గురించి మాట్లాడుతూ.. అఖిల్ లేకుండా ఈ సినిమా లేదని.. అతను పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడని సురేందర్ తెలిపాడు.
మమ్ముట్టి పాత్ర కూడా చాలా కీలకం అని.. ఆయన సినిమా కోసం ఎంతో సహకరించాడని సురేందర్ తెలిపాడు. తాను అభిమానుల గురించి ఆలోచించి సినిమా తీయనని.. ఏజెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on April 16, 2023 7:18 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…