Jio Studios
3G సాంకేతికత ఉన్నప్పుడు ఒక జిబి డేటా కోసమే కనీసం వంద రూపాయలు ఖర్చు పెట్టే రోజుల నుంచి రోజుకో రెండు జిబి వాడినా నెల మొత్తం మూడు వందల్లోపే అయ్యే సౌలభ్యం తీసుకొచ్చింది జియోనే. 4జి లాంచ్ తో టెలికాం రంగంలో పెను విప్లవం సృష్టించిన ముఖేష్ అంబానీ ఇప్పుడు ఓటిటిని విస్తరించే పనిలో పడ్డారు.
ఇటీవలే ముంబైలో జియో స్టూడియోస్ ఒక గ్రాండ్ ఈవెంట్ జరిపింది. త్వరలో తమ ప్లాట్ ఫార్మ్ మీద విడుదల కాబోయే 100 సినిమాలు, వెబ్ సిరీస్ ల టైటిళ్ళను ఓ ట్రైలర్ రూపంలో రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది. ఎందుకంటే అందులో చాలా క్రేజీ కంటెంట్ ఉంది.
కనీసం పదిహేను వందల కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనాలున్న షారుఖ్ ఖాన్ డుంకీని జియోనే కొనుగోలు చేసింది. బాలీవుడ్ స్టార్లు నటించిన భారీ చిత్రాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలే ఐపీఎల్ 2023ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేసి హాట్ స్టార్ లాంటి పోటీదారులకు ఝలక్ ఇచ్చిన జియో రాబోయే రోజుల్లో కొత్త సినిమాలను సైతం ఇలా ఉచితంగా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ముందు జనానికి బాగా అలవాటు చేసి వాడకుండా ఉండలేని పరిస్థితి తీసుకొచ్చాక అప్పుడు మెల్లగా డబ్బులు తీసుకోవడం ముందు నుంచి అనుసరిస్తున్న ఎత్తుగడే
రాబోయే రోజుల్లో ఇండియాలో ఓటిటిలకు జియో గండం తప్పేలా లేదు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, హాట్ స్టార్ లాంటి వాటికీ భారీగా ఉన్న చందాదారులను ఇటువైపు తిప్పుకునే పనిని జియో త్వరలో మొదలుపెట్టనుంది. ప్రస్తుతానికి బాలీవుడ్ తో మొదలుపెట్టి మెల్లగా రీజనల్ మార్కెట్ వైపు దృష్టి పెట్టనుంది. అదే జరిగితే ముఖేష్ అంబానీ తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు భారీగా ఉండబోతున్నాయి. అసలే చిన్న సినిమాలకు జనం థియేటర్లకు కష్టమైపోతున్న తరుణంలో ఇప్పుడు జియో స్టూడియోస్ ప్రణాళికలు చూస్తుంటే పెద్ద గండమే ఎదురయ్యేలా ఉంది
This post was last modified on April 14, 2023 11:25 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…