యువ కథానాయకుడు నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో తెలిసిందే. వైవిధ్యమైన కథలతోనే ఎక్కువగా ప్రయాణం చేసిన అతను.. ఒక దశలో తొమ్మిది సినిమాలు లైన్లో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అందులో కొన్ని మంచి ఫలితం కూడా అందుకున్నాయి. ఐతే ఒక దశ దాటాక రోహిత్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు రోహిత్. చివరగా ఏడాదిన్నర కిందట అతడి నుంచి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చప్పుడే లేకుండా వచ్చి వెళ్లిపోయిన ఆ సినిమా తర్వాత రోహిత్ అడ్రస్ లేకుండా పోయాడు. మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ఉన్న హీరో ఇలా అదృశ్యం అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే రోహిత్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అతడి ఆప్త మిత్రుడు శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడాడు. నారా రోహిత్ అడ్రస్ లేడేంటి అని అడిగితే.. ‘‘అతడి సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ అవసరమనుకున్నాడు. అందుకే కొంత కాలం పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఐతే త్వరలో నేను, రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయడబోతున్నాం. దాంతో పాటు రోహిత్ ఇంకొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. రీఎంట్రీలో అతడి నుంచి మంచి సినిమాలొస్తాయి’’ అని విష్ణు తెలిపాడు.
ఇక రోహిత్తో తన స్నేహం గురించి చెబుతూ.. ‘‘రోహిత్కు నాపై అంత అభిమానం ఎందుకొచ్చిందో తెలియదు. అలాంటి వ్యక్తి మరొకరిని నేను చూడలేదు. ఎంతసేపూ ఇవ్వడానికే చూస్తాడు. ఏమీ ఆశించడు. నేనైనా బిజీగా ఉండి తనకు ఫోన్ చేయడం మరిచిపోతుంటా. కానీ రోహిత్ మాత్రం ప్రతి రోజూ గుర్తుంచుకుని నాకు ఫోన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండు ఉండటం నా అదృష్టం’’ అని చెప్పాడు.
This post was last modified on April 23, 2020 1:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…