యువ కథానాయకుడు నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో తెలిసిందే. వైవిధ్యమైన కథలతోనే ఎక్కువగా ప్రయాణం చేసిన అతను.. ఒక దశలో తొమ్మిది సినిమాలు లైన్లో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అందులో కొన్ని మంచి ఫలితం కూడా అందుకున్నాయి. ఐతే ఒక దశ దాటాక రోహిత్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు రోహిత్. చివరగా ఏడాదిన్నర కిందట అతడి నుంచి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చప్పుడే లేకుండా వచ్చి వెళ్లిపోయిన ఆ సినిమా తర్వాత రోహిత్ అడ్రస్ లేకుండా పోయాడు. మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ఉన్న హీరో ఇలా అదృశ్యం అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే రోహిత్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అతడి ఆప్త మిత్రుడు శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడాడు. నారా రోహిత్ అడ్రస్ లేడేంటి అని అడిగితే.. ‘‘అతడి సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ అవసరమనుకున్నాడు. అందుకే కొంత కాలం పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఐతే త్వరలో నేను, రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయడబోతున్నాం. దాంతో పాటు రోహిత్ ఇంకొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. రీఎంట్రీలో అతడి నుంచి మంచి సినిమాలొస్తాయి’’ అని విష్ణు తెలిపాడు.
ఇక రోహిత్తో తన స్నేహం గురించి చెబుతూ.. ‘‘రోహిత్కు నాపై అంత అభిమానం ఎందుకొచ్చిందో తెలియదు. అలాంటి వ్యక్తి మరొకరిని నేను చూడలేదు. ఎంతసేపూ ఇవ్వడానికే చూస్తాడు. ఏమీ ఆశించడు. నేనైనా బిజీగా ఉండి తనకు ఫోన్ చేయడం మరిచిపోతుంటా. కానీ రోహిత్ మాత్రం ప్రతి రోజూ గుర్తుంచుకుని నాకు ఫోన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండు ఉండటం నా అదృష్టం’’ అని చెప్పాడు.
This post was last modified on April 23, 2020 1:46 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…