యువ కథానాయకుడు నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో తెలిసిందే. వైవిధ్యమైన కథలతోనే ఎక్కువగా ప్రయాణం చేసిన అతను.. ఒక దశలో తొమ్మిది సినిమాలు లైన్లో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అందులో కొన్ని మంచి ఫలితం కూడా అందుకున్నాయి. ఐతే ఒక దశ దాటాక రోహిత్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు రోహిత్. చివరగా ఏడాదిన్నర కిందట అతడి నుంచి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చప్పుడే లేకుండా వచ్చి వెళ్లిపోయిన ఆ సినిమా తర్వాత రోహిత్ అడ్రస్ లేకుండా పోయాడు. మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ఉన్న హీరో ఇలా అదృశ్యం అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే రోహిత్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అతడి ఆప్త మిత్రుడు శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడాడు. నారా రోహిత్ అడ్రస్ లేడేంటి అని అడిగితే.. ‘‘అతడి సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ అవసరమనుకున్నాడు. అందుకే కొంత కాలం పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఐతే త్వరలో నేను, రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయడబోతున్నాం. దాంతో పాటు రోహిత్ ఇంకొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. రీఎంట్రీలో అతడి నుంచి మంచి సినిమాలొస్తాయి’’ అని విష్ణు తెలిపాడు.
ఇక రోహిత్తో తన స్నేహం గురించి చెబుతూ.. ‘‘రోహిత్కు నాపై అంత అభిమానం ఎందుకొచ్చిందో తెలియదు. అలాంటి వ్యక్తి మరొకరిని నేను చూడలేదు. ఎంతసేపూ ఇవ్వడానికే చూస్తాడు. ఏమీ ఆశించడు. నేనైనా బిజీగా ఉండి తనకు ఫోన్ చేయడం మరిచిపోతుంటా. కానీ రోహిత్ మాత్రం ప్రతి రోజూ గుర్తుంచుకుని నాకు ఫోన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండు ఉండటం నా అదృష్టం’’ అని చెప్పాడు.
This post was last modified on April 23, 2020 1:46 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…