యువ కథానాయకుడు నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవాడో తెలిసిందే. వైవిధ్యమైన కథలతోనే ఎక్కువగా ప్రయాణం చేసిన అతను.. ఒక దశలో తొమ్మిది సినిమాలు లైన్లో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో అరడజనుకు పైగా సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అందులో కొన్ని మంచి ఫలితం కూడా అందుకున్నాయి. ఐతే ఒక దశ దాటాక రోహిత్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. దీంతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు రోహిత్. చివరగా ఏడాదిన్నర కిందట అతడి నుంచి ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చప్పుడే లేకుండా వచ్చి వెళ్లిపోయిన ఆ సినిమా తర్వాత రోహిత్ అడ్రస్ లేకుండా పోయాడు. మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ఉన్న హీరో ఇలా అదృశ్యం అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే రోహిత్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అతడి ఆప్త మిత్రుడు శ్రీవిష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి మాట్లాడాడు. నారా రోహిత్ అడ్రస్ లేడేంటి అని అడిగితే.. ‘‘అతడి సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో పునరాలోచనలో పడ్డాడు. కొంచెం గ్యాప్ అవసరమనుకున్నాడు. అందుకే కొంత కాలం పాటు కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఐతే త్వరలో నేను, రోహిత్ కలిసి ఓ పెద్ద సినిమా చేయడబోతున్నాం. దాంతో పాటు రోహిత్ ఇంకొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. రీఎంట్రీలో అతడి నుంచి మంచి సినిమాలొస్తాయి’’ అని విష్ణు తెలిపాడు.
ఇక రోహిత్తో తన స్నేహం గురించి చెబుతూ.. ‘‘రోహిత్కు నాపై అంత అభిమానం ఎందుకొచ్చిందో తెలియదు. అలాంటి వ్యక్తి మరొకరిని నేను చూడలేదు. ఎంతసేపూ ఇవ్వడానికే చూస్తాడు. ఏమీ ఆశించడు. నేనైనా బిజీగా ఉండి తనకు ఫోన్ చేయడం మరిచిపోతుంటా. కానీ రోహిత్ మాత్రం ప్రతి రోజూ గుర్తుంచుకుని నాకు ఫోన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండు ఉండటం నా అదృష్టం’’ అని చెప్పాడు.
This post was last modified on April 23, 2020 1:46 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…